Wednesday, 30 January 2019

పెరియపురాణం-3

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

శ్రీ రమణులు చెప్పిన కధలు_
పెరియ పురాణ కథలు(సంక్షిప్త సమీక్ష)

సుందరార్

ఇంతకుముందు మనం చెప్పుకొన్న ముగ్గురు కవులలో సుందరార్ ఆఖరివాడు.  ఇతను ఎనిమిదవ శతాబ్దానికి చెందిన కవి. మధుర కవి కూడా. సుందరుడు,శంకరుని తన చెలికాడు లా భావించి కవిత్వం చేశాడు. చెలిమి లోని స్వాతంత్ర్యం ప్రదర్శించాడు.   తన ముందు భక్త కవుల్లా   విపరీతమైన శుశ్రూష. చేసినట్లు లేదు. అందునా శంకరుడు భక్త సులభుడు కదా...! అందుకే కాబోలు భక్తి ఉద్యమ తీవ్రత సన్నగిల్లిందేమో అనిపిస్తుంది

అంతే కాదు  ఈ అరవై ముగ్గురు నాయనార్ల లోనూ ఆఖరి వాడే అన్నట్టు తోస్తోంది. తన పదకవితలలో అందరి పేర్లు పేర్కొన్నట్లు గా ఉంది. అతను రాసినట్లుగా ఈకింది పద్యం.(సోర్స్: వికిపీడియా)

జ్ఞాన సంబంధార్,తిరు నవుక్కరసర్ ఇరువురూ తమిళ భాషా కోవిదులు, నలయిప్పొవన్ జ్ఞాని- సుదన్,సక్కియన్,సిలాంది,కణ్ణప్పన్,కనమపుల్లన్...మొదలైన వారి తప్పులున్నా నీవు ఒప్పుగానే పరిగణించావు
అందుకే నూపుర సవ్వడినై  నీ పాదాల చెంత చేరాను
బంగారు కలువల తో కాంతులీను సరస్సు లున్న
'తిరుప్పుంగూర్' నందున్న ఓ ప్రభువా..

భక్త సుందరార్‌ పుట్టింది తిరునవలూర్ అని చెప్పబడినా, మన రమణులు చెప్పిన పేరు ...అరుణాచలం సమీపంలోని జంబూపురం.  బహుశ ఒకటే కావచ్చు.తండ్రి జటిలుడను బ్రాహ్మణుడు, తల్లి జ్ఞానవతి.  తిరువూరు లోని ఆలయ శాసనల్లో సుందరార్ తలిదండ్రులు ఇద్దరూ నాయనార్ల ని పేర్కొన్నారుట.

సుందరుడు పేరుకు తగ్గట్టు మహా సుందరుడు. చిన్నపిల్లవాడుగా ఉన్నపుడే చోళ రాజు నరసింహిడు ఆపిల్లవాని చక్కదనానికి ముచ్చటపడి దత్తత తీసుకుంటాడు. రాజ్యాధికారం కూడ ఈయబోగా..అది బ్రాహ్మణ విధి కాదని నచ్చచెప్పి, తీసుకుని పోయి ఉపనయనం చేసి..వేదవేదాంగాలు, అగమశాస్త్రం నేర్పుతాడు.

 సుందరార్ పూర్వ జన్మ కధనొకదానిని శ్రీరమణులు చాలా చక్కగా చెప్తారు.
 ‎  ఒక నాడు  పార్వతి పరిహాసానికి శివుని అందచందాలు లేని వానిగా ఎత్తిచూపితే, శివుడు పరమ మోహానాకార రూపములో కనిపించి ఆమెను చకిత ను చేస్తాడు. అప్పుడు తన ప్రతిబింబానికి ఓ రూపం ఇచ్చి 'సుందరుడని' పేరు పెట్టి, *త్వమేవాహం* అన్నట్టు.‌.ఆదరిస్తాడు.  అలా ఉండగా సుందరుడు పార్వతి చెలికత్తె ల పట్ల మోహం ప్రకటించగా కోపించిన శివుడు  ఆ చెలికత్తెలతో సహా మానవ జన్మ ఎత్తమని శపిస్తాడు. కాని సుందరునికి గొప్ప కవికాగలడని,అట్లే పూర్వజన్మ జ్ఞానం ఉండేట్టు అభయమిస్తాడు.
 ‎
 ‎ప్రస్తుతం లోకి వస్తే...
సుందరునికి పెళ్ళి నిశ్చయమవుతుంది. యువరాజు తో సమానం కాబట్టి ఘనమైన పెళ్ళి ఏర్పాట్లు జరుగుతాయి. అంకురార్పణ జరిగి సుందరుడు పెళ్లి పీటలమీద కూర్చున్నాడు. అప్పుడు ఉన్నట్టుండి ఒక పండు ముసలి వ్యక్తి వచ్చాడు ‎అక్కడికి.    *శివుడో లేక నంది వంటి శైవుడో* అనుకొంటూ అతని రాకకు కారణం అడగగా, సభనుద్దేశించి అతడు సుందరుడు తనకు దాసుడు అని అందుకు ప్రమాణ పత్రము అతని తాత రాసిచ్చినది ఉందని చూపిస్తాడు. ఈ విషయం లో వాదోపవాదాలు, పరీక్షలు అయ్యాక,తప్పనిసరిగా సుందరుడు అతని వెంట వెడతాడు. సరాసరి అతడు ఈశ్వరాలయము లోకి దారి తీసి అక్కడ అంతర్ధానం అవుతాడు.  ఈతనికి నిజంగానే మతిలేదు అనుకొంటూ సుందరుడూ చూస్తూంటే ,పరమేశ్వరుడు సకుటుంబంగా దర్శనమిస్తాడు. తనను అంతకుముందు పిచ్చివాడా అని పిలిచినందుకు..అదే మకుటంగా స్తుతి గీతాలు రాయమని, సరస్వతీ అనుగ్రహం ప్రసాదిస్తానని చెప్పి ఆశీర్వదించి పంపుతాడు.

పీటలమీద ఆగిపోయిన పెళ్ళి..కాని సుందరుడలాగే కర్పూరదండలతో పెళ్ళి కొడుకు లాగానే  అనేక ద్రావిడ గీతాలు పాడుతూ తిరుగుతూంటాడు.

_అలా పీటలమీద పెళ్ళి ఆపిన శివుడే సుందరుడు పెళ్ళి సంబంధం కుదర్చడానికి రాయబారం నడుపుతాడు...

గమత్తేమిటంటే సుందరార్ కి పెళ్ళి ఆగిపోయినా, తర్వాత ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు జరుగుతాయి.  తనకీ భగవంతునికి పోలిక తెస్తూ సరసోక్తి  లా ఉండి అతను రాసిన ఈ కవిత చూడండి.

*నీవే సగం స్త్రీ గా ఉన్నావు
గంగమ్మ ఉన్నదేమో నీ దీర్ఘ కేశాల మధ్య
నీకు మాత్రం తెలయదనా
స్త్రీల తో ఇక్కట్లు

*కథ లోకి వస్తే..*
తిరువారూరు గా పిలవబడే కమలాలయములో సుందరుడు అక్కడి దేవుడైన  త్యాగీశుని స్తుతిస్తూ, సేవిస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ ఊరి లో నే పరవ అనే దేవదాసీ తన తల్లి తో కలిసి దేవాలాయములో తన నృత్యం చేస్తూ దేవుణ్ణి సేవిస్తూ ఉంటుంది. ఇతిహాసం ఏమిటంటే పరవ,  పూర్వం శాపం పొందిన పార్వతి దేవి చెలికత్తెలలో ఒకతె.

పరవ మహా అందగత్తె. సుందరుడు ఆమెని చూసి మనసు పారేసు కొంటాడు. పరవ అదే సమయంలో సుందరుని పట్ల ఇష్టం పెంచుకొంటుంది. సుందరునకైతే భగవంతుని ధ్యాసే లేదు..స్తోత్రాలూ లేవు...పరవే పంచాక్షరీ అయింది. త్యాగేశ్వరుడు తన భక్తుని అవస్త చూడలేక సాయం చేయటానికి ముందుకి వచ్చాడు.సుందరునిక కోరిక మీద దూతగా వెళ్లడానికి ఒప్పుకున్నాడు.సాక్షాత్తూ వారి ఇష్ట దైవమే దౌత్యానికి రావడం తో పరవ, పరవ తల్లికి నోట మాటే లేదు. పరవా సుందరుల వివాహం జరుగుతుంది. నిజానికి వివాహానంతరం సుందరుని గానం ద్రవిడ భాషలో మరింత మాధుర్యాన్ని సంతరించుకొంది.
భగవంతుని కోరిక మీదతన ముందు తరం భక్తుల(నాయనార్లు) జీవిత చరిత్ర గానం చేశాడు.
 శ్రీ రమణులు రాసిన కధలో ఇంకా ఇలా ఉంది. శంకరుడు సుందరుడితో..నీవే నేను అన్నట్టుగా ఉంటాడు కదా, తన భక్తునికి భార్య పైగల ప్రేమ, వ్యామోహం వల్ల తనపై భక్తి ప్రదర్శించే తీరు మారడం గ్రహిస్తాడు. అనుదినం ధూళి దర్శనమే అవుతూంటుంది. ఓనాడు తన భక్తుని చేరి మేలమాడుతూ, అతని సంసార జీవితం గురించి తరచి తరచి అడగుతాడు. ఆ తర్వాత సుందరుని మనసు పరిపక్వత నొందేలా  ప్రభోదిస్తాడు.

*ఒక చెట్టు పైన రెండు పక్షులు. ఒక పక్షి కింది కొమ్మ మీద కూర్చుని తీయతీయ పండ్లని రుచి చూచి,తరువాత చేదు ఫలితములను పొందుచున్నది. పై కొమ్మ మీద పక్షి ఈ లీలను గమనించుచు సాక్షిగా ఉన్నది. మొదటి పక్షి జీవుడు. రెండవ పక్షి శివుడు లేక ఆత్మ ( ముండకో పనిషత్).*
 ‎
*  చైతన్య స్వరూపమని. ఆనంద సాగరమైన  తనను వీడి,  సాంసారిక సౌఖ్యములనే నీటితుంపరులకై భ్రాంతి
చెందువారీ జీవకోట్లు .ఇది తెలిసినచో జన్మ రాహిత్యమే కదా!*

సాక్షాత్తూ పరమేశ్వరుని నుంచి ఉపనిషత్ సారాన్ని పొందిన సుందరార్ తర్వాత కమ్మని గేయ రచనలు చేసాడు. సుందరార్ తనకు తనభగవంతునికీ మధ్య సంబంధం లో ఎలాటి హద్దులూ విధించుకోడు.  తన జీవితంలో తను చేసిన తప్పులు,ఒప్పులు అన్నిట్లో అతనిని భాగస్వామి ని చేస్తాడు.అందుకు దృష్టాంతంగా రేపటి భాగంలో..సుందరుని రెండవ పెళ్ళి..పర్యవసానం.

సుందరుని భక్తి గురించి ఒక విషయం చెప్పుకోవాలి.  భౌతిక మైన జీవితం పట్ల వ్యామోహం ఉన్నప్పటికీ, హృదయాంతరాళ లో అతనికి భగవంతుని పట్ల నిశ్చలమైన భక్తి ఉంది. ఏమి కోరినా 'తండ్రి' ని కోరవలసిందే కదా, స్వేచ్ఛ అయినా, నిర్భాగ్యులపై కరుణ అయినా, చందనాది సుగంధ ద్రవ్యాలైనా, బంగారమైనా.  అంతెందుకు ...తను కోరిన యువతి ని పెండ్లాడానికైనా. పరమేశ్వరుడొక్కడె అతనికున్న ఆధారం. భగవంతుని, భగవత్ భక్తులను కీర్తించడమే అతని నిత్యకృత్యం.
అనేక క్షేత్రాలను సందర్శిస్తూ..తన సంకీర్తనలన తో అక్కడ వెలసిన దేముణ్ణి స్తుతిస్తూ..ఇలా సంచారం చేస్తూ అతడు అమృతఘటేశ్వరం,ఛాయావనేశ్వరం శ్వేతవనం, విశాలనగరం  దాటిపోతూ..అడవి దారుల తిరుగాడుతూ...ఒక చోట విపరీతమైన ఆకలి దప్పులతో అలమటించసాగాడు. దయాళుడైన శంకరుడు బోజనం ఏర్పాటు అయ్యేలా చూస్తాడు.  మరొక సారి శంకరుడు తానే బిచ్చమెత్తి తన భక్తుని ఆకలి తీరుస్తాడు. అక్కడనుంచి కాంచీపురం,  ఆపైన శ్రీ కాళహస్తి,
శ్రీబంధకపురం చేరు కొంటాడు‌ .
 అక్కడకి దగ్గరలోనే భానుపురం అనే ఊరిలో ఒక వృద్ధ దంపతులకు  శృంఖల అనే కూతురు ఉంటుంది. పూర్వం శాపం పొందిన పార్వతీదేవి ఇద్దరు చెలికత్తెల లో రెండవది. యుక్తవయసు లో ఉన్న సౌందర్యరాసి. శివభక్తురాలు. మన సుందరునికి పూర్వవాసనలు ఎక్కడికి పోతాయి. ఆమె పై ప్రేమ, ఎలాగైనా ఆమెను పొందాలని ఆరాటం. సుందరుని పరవా ప్రణయావేశం తెలిసికొన్నది కనుక, పెళ్లి అయినవాడని ఆమె నిరాకరిస్తుంది.
 ‎శివుడా అభయశంకరుడు..తప్పేదేముంది తానే మధ్యవర్తిత్వం నెరుపుతాడు. పెళ్ళి అయ్యాక తనని వదలి ఉండనని శపథం చేస్తే అలాగే నని చెప్తుంది. ఇక్కడ భక్తి, రక్తి రెండూ పోటీ పడతాయి.  అలాగే నని తను శపథం చేస్తానని ఒప్పుకుంటాడు సుందరుడు. ఈ వార్త మోసుకొచ్చిన శంకరుణ్ణే  కోరుతాడు
'రేపు నేను నీ లింగం దగ్గర శపథం చేస్తాను. కాని నీవొక సహాయం చేయాలి...నేను శపథం చేసే సమయంలో, ఆ లింగంలో ఉండకుండా బయట ఉన్న పొగడచెట్టు లో ఉండు' అని‌.
పరమశివుడు అలాగే నని, శృంఖల దగ్గర కు వెళ్లి అంటాడు కదా... లోపల గుళ్లో లింగం దగ్గర కాకుండా, బయట పొగడ చెట్టుదగ్గర ప్రమాణం చేయమని కోరమంటాడు.
సుందరుడు విథి లేక అలాగే శృంఖల కోరుకొన్నట్లు ప్రమాణం చేస్తాడు. వివాహం అవుతుంది. కొన్నాళ్ళు శ్రీబంధకపురంలో, శృంఖలా బద్ధుడై జీవితం సాగిస్తాడు.

వసంతకాలం వచ్చింది..కోయలలు కూసాయి..సుందరునకు తన ఊరి కోకిలపాట గుర్తుకొచ్చింది‌....వెన్నల జాబిలి....అలాగే పరవ. ఇక మనసు నిలవలేదు. శివుని ఎదుట శృంఖలకు తానిచ్చిన వాగ్దానాన్ని మరచి శ్రీపురం బయలుదేరాడు సుందరుడు. ఊరి పొలిమేర చేరుకోగానే సుందరునికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి అంధత్వం వచ్చింది..ఆపైన శరీరం లో కుష్ఠు రోగము. మతిపోయిందీ పరిణామంతో. శివుని వేడుకొంటాడు .యథాస్తితి ఇవ్వమని. శివుడు స్పందించడు. చిరాకుతో 
' అసలు నువ్వున్నావా?' అంటూ రంకెలు వేస్తాడు.

సుందరార్ భక్తి మధుర భక్తి అని చెప్పుకున్నాము కదా. అంతమాత్రాన అతనిని కాముకుని గా పరిగణించడానికి వీలులేదు.  కొంతమంది అతని ని సాక్షాత్ త్యాగీశుడుగాను కొంతమంది త్యాగీశుని సన్నిహితుని గాను భావించేవారట.

సుందరార్ కి తన భక్తి ఏమో తనేమో అన్నట్టు తను నమ్ముకొన్న  దైవాన్ని అనేక విధాలుగా స్తుతిస్తూ.. తానా  చంద్రశేఖరునికి దాసుడనే చెప్పుకొంటూ...ఎప్పటికప్పుడు పునరంకితం అయ్యేవాడు.

*ఆహా పాపిని కదా,నిర్మలమైన ప్రేమ,సేవా మార్గమును వదిలావు కదా
నాకున్న రోగము, బాధ ఏమిటో ఇప్పుడు తెలిసింది
నేను వెళ్లి  కొలుచుకోవాలి నా తండ్రి ని...మూర్ఖుడిలా..ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగానో..నీనుంచి దూరంగా..*

పశ్చాత్తాపం తో ఇలా ప్రార్థనలు చేశాడు.అలా అతడు కంచి చేరి ఏకామ్రేశ్వరుడుకి ప్రార్ధిస్తే ఎడమకన్నుకు మాత్రం చూపునిస్తాడు. అలాగే కుర్తాళం చేరి అక్కడ ప్రార్ధించి భగవదాజ్ఞ మీద అక్కడి తీర్ధం లో స్నానం చేయగానే చర్మవ్యాధి నయమవుతుంది. చివరకు శ్రీపురం చేరి త్యాగేశుని పరిపరివిధాల ప్రార్ధించి...తన రెండవకంటి చూపుని పొందడమేకాక ,తన భార్య పరవను పరమేశ్వరుని ఆశీర్వాదం తో తిరిగి పొందుతాడు.

*పంచ భూతాలు గతులు తప్పచ్చు, తన సతికి సహదేహమిచ్చిన పరమేశ్వరుని పాదపద్మములు విడువకెన్నడూ‌.
ప్రీతి తో ఈశును స్తుతించే నియమమూ విడువకు.*

*నాశనం లేనిది, తిరిగి పొందలేని సంపదేయితే ఉందో అదే
కలిగి ఉండు
బంగారమైనా,ఇటుకరాయైనా ఒకలాగే చూడు
పొంగిపొరలే ప్రేమేతో ముకుళితహస్తవై ఉండటం తప్ప దేనినీ ఆశించకు....కడకు,  ముక్తి ని కూడా కోరుకోకు*

ఇలా ఇతని భక్తి, కీర్తి .....తిరువూరు వచ్చిన చేరరాజు కు తెలుస్తాయి. సుందరార్. చేరరాజు  మంచి మిత్రులు అవుతారు. ఇద్దరూ కలిసి అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ఇక సుందరార్  జీవితం లో అలుపు చెందుతాడు..కైలాసము పై బెంగ ఉన్నట్లు గేయదశకాన్ని రాస్తాడు.

*ఓ తండ్రి, యముడు నాకోసం వచ్చినరోజున
 'ఇతడు నాసేవకుడు' అని నిరోధించు
ఒకనాడు ముని కుమారుణ్ణి కాపాడి నట్లే..
నీ పాదాలనంటి వేడుకొంటున్నా...రక్షింపుము*

ఆషాఢ మాసంలో స్వాతి నక్షత్రమునాడు,  కైలాసమునుండి అతని కోసం ఒక తెల్లని ఏనుగు(ఐరావతం) వస్తుంది. చేరరాజు కూడా తన గుర్రముపై అతనిని అనుసరిస్తాడు...పరమశివుని అనుమతితో ఆవిధంగా తన మితృనితో  శివ సాన్నిధ్యాన్ని చేరతాడు.

*ముక్తాయింపు*

పెరియపురాణం అనే తమిళ పురాతన గ్రంథం చాలా గొప్ప కావ్యం. పూర్తి గా చదవగలగడం..అంతకంటే అర్ధం చేసుకోవడం రెండూ కష్టమే.  ఇందులో అరవై ముగ్గురి నాయనార్ల చరిత్ర..వారి గీతాలు ప్రాచీన తమిళ భాషలో ఉన్నాయిట.ఈ నాయనార్లంతా అన్ని వర్గాలకీ చెందినవారు.రకరకాల వృత్తులవారు. కొందరు స్త్రీలూ ఉన్నారు. అందుకనే వారి భక్తిగీతాలు ప్రజల,వారి జన జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి.

పెరియపురాణం తమిళంలో సంకలనం చేసిన శేక్కియార్ ఈ గ్రంధం గురించి చెప్పిన పదాలకు ఇంగ్లీషు నుంచి నా స్వీయానువాదం

*అమర ప్రేమ చవిచూపే మకరందమిది - సేవించు
మనసనే క్షేత్రాన్ని సారవంతంగా చేసే నిరతంతరం పారే ప్రేమ వాహిని యిది-సాగుచేసుకో
మంచిముత్యాలనే సలక్షణాలను  రాశులు గా ప్రోది చేసి ఇచ్చే మహా సాగరమిది -వసించు
బంధాలను ఛేదించి విముక్తి నిచ్చే పదునైన ఖడ్గమిది-గట్టిగా పట్టి ఉంచు
జీవితానికి కావలిసిన నైతిక విలువలు బోధించే గురువు-
నీలో దృఢమైన క్రమశిక్షణ పెంపొందించుకో
చారిత్రక సమాచారం పొందుపరచిన నిధి ఇది -నీ జ్ఞానాన్ని పెంపొందించుకో*

శ్రీ రమణులు చెప్పిన కథలు నా అవగాహన పరిథిలో వాటిని క్లుప్తంగా రాసుకొంటూ,ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా కూడా కొన్ని విషయాలు రాస్తూ వచ్చాను. పద్యాలు _pdf నుంచి కొన్ని అవసరం మేర అనువదించాను. *ఇక ఏదీ నాసొంతం కాదు* 



పెరియ పురాణం-2

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

శ్రీ రమణులు చెప్పిన కధలు_
పెరియ పురాణ కథలు(సంక్షిప్త సమీక్ష)
అజ్ఞానభిత్(అప్పార్)

జ్ఞానసంబంధార్ 'అప్పా' అని సంబోధించడం వల్ల ఈయనకి అప్పార్ అని పేరు వచ్చింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు మరుల్ నీక్కియార్. ఇతనిది సాదా సీదా వ్యవసాయ కుటుంబ నేపథ్యం.
ఆమూర్ అనె పల్లె లో కీర్తిమంతుడు, మాదిని అనే దంపతులకు జన్మించాడు. వారికి  ముందు తిలకావతి అనే కూతురు కూడ ఉన్నది. మా అజ్ఞానభిత్(మరుల్ నీక్కియార్) పుట్టిన ఆమూరు ఊరి దైవము వీరాట్టేశ్వరుడు.

 ఆ పల్లె గురించి "భగవాన్* ఎంత మనోహరంగా వర్ణించారంటే ఆయన మాటల్లోనే *వ్యవసాయ దారులు తమ పొలములలో కుప్పతెప్పలుగా పోగులయేట్లు పండించేవారు. ప్రజలు 'అన్నపూర్ణాదేవి దగ్గర బంధువులా' అనిపించేంత ఉదారులు. సోమయాజులు నిర్వహించే నిరంతర యాగ యజ్ణములనుండి వెలివడే ధూమం మబ్బులై,వర్షమును కురిపించు చుండేవి*
ఇంత సుసంపన్నమైన ఊరిలో, పరమేశ్వరుడు ' వీరాట్టేశ్వర' రూపంలో కొలువై ఉన్నచోట మన కవి బాల్యం బాగానే గడిచింది. చదువుసంధ్యలు  బాగా నే అబ్బేయి.

ఇతని సోదరి తిలకావతి కి వివాహం నిశ్చయమౌతుంది.వరుడు
ఆదేశపు రాజు దగ్గర సేనానాయకుడు గా చేస్తుంటాడు దురదృష్టవశాత్తూ, పెళ్లికి ముందే యుద్దము లో ఆయువకుడు చనిపోతాడు. ఈ హఠాత్పరిణామానికి హతాశుడైన వారి తండ్రి కూడా మరణిస్తాడు.
తిలకావతి విరాగి అవుతుంది. పూర్తిగా వీరాట్టేశ్వర స్వామి వారి సేవలలో అంకింతమై పరమ భక్తురాలౌతుందామె.  ఆ సమయంలో అజ్ఞానభిత్ ధర్మబద్ధంగా జీవిస్తున్నపటికీ, ధర్మ కార్యాలకు అమితంగా ధనం వ్యయం చేస్తాడు. అతనికి జైన మతస్థుల తో పరిచయం అవుతుంది. వారితో తర్కములొ పాల్గొంటాడు. వారు తము నిర్వహించిన వివిధ సభలలో వైదిక మార్గం ఖండన చేస్తూ,తమ మతము అహింసా ప్రధానమైనదని, సూర్యాది గోళములన్నీ భౌతికములే అయి ఉండగా వాటికి పూజలెట్లా సమంజసమని, అందు చేత అన్నిటికన్నా తమ మార్గమే విశిష్టమైన దనీ..అనే వారివాదనలలో క్రమేపీ నమ్మకం ఏర్పడుతుంది అతనికి. క్రమంగా వారి సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై మతం మార్చు కొని ధర్మసేనుడు గా తన పేరు మార్చుకుంటాడు. పాటలీపుత్ర మతాచార్యుడు గా నియమింపబడతాడు.
 శివభక్తి గల అతని అక్క  తిలకావతి ఎంత వారించినా లక్ష్య పెట్టడు. తిలకావతి మహా భక్తురాలు తన తమ్ముడి మనసు మార్చమని ఆ పరమ శివుని ప్రార్థిస్తుంది. ఆవిడ ప్రార్థన పరమేశ్వరుడు ఆలకించినట్లే ఉంది.
 ‎ఓ  రోజు అతనికి విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. ఎంతకీ ఉపశమించదు. తన సోదరికి కబురుచేస్తాడు. ఆమె అతనినే తనదగ్రకు రమ్మనమని, జైన మత సూచిక లైన దుస్తులు అవీ మార్చుకొని,నదీ స్నానం చేసి విభూతి అద్దుకొని వస్తే కాని చూడనని నిష్కర్షగా అంటుంది. అతనలాగే చేస్తాడు ఉపశనమార్గం వేరే లేక. అమే    వీరాట్టేశ్ర్వ ర స్వామి సన్నధికి తీసుకు వెళ్ళి శివదీక్ష ఇస్తుంది అప్పటికి అతని ఆవేదనంతా ఉపశమిస్తుంది. ధర్మసేనుడు తిరిగి అభిజ్ఞతుడై అక్క దగ్గర శివకైంకర్య విధానాన్ని ఆమూలాగ్రంగా తెలిసికొని ఆచరించడం మొదలుపెట్టాడు. శివసన్నధిలో దేవుని స్తోత్రం చేయాలనే ఆతని కోరికకు పరమేశ్వరానుగ్రహంతో సరస్వతీదేవి నాలుకపై నిలిచి ప్రేరేపించింది.... ఆశువుగా పరమేశ్వరుని స్తుతించసాగాడు. అప్పటినుంచి వాగీశుడు అన్న పేరొచ్చింది అని ఇతిహాసం.

*తారక్ష్య నదీతీరాన వెలసినట్టియు,విద్రుమాద్రి శిఖరసీమలో నివసించునట్టియు, చూపు తోనే రోగములను నివారచునట్టి వీరాట్టేశ్వరునకు నతి*
*దుష్టుడనైన నాకు శిష్ట బుధ్ధి నిచ్చి,వినయసంపన్నుని చేసి, రోగముక్తుణ్ణి చేసి,నీ భక్తునిగా మలచుకొన్న దయావారాశివైన నీకు ఏటికోళ్లు*

ఈ పరమ భక్తుడు తన దాస్యభక్తి తో అనేక క్షేత్రాలు దర్శించి పరమశివుని ఎలా ప్రసన్నం చేసుకొన్నాడో..అప్పార్ గా జ్ఞాన సంబంధునితో చేరి శైవమతం ప్రచారం...ముఖ్యంగా అతని కవిత్వంలో ని ప్రత్యేకత.
ఆవిధంగా ఆసువుగా భక్తి కీర్తనలు ఆలపించిన అజ్ఞానభిత్
( మరుల్ నీక్కియార్ ) వాగీశుడనే బిరుదు పొందాడు. ఇక్కడ ఒకటి గ్రహించాలి. శ్రీ రమణులు పుస్తకం లో అజ్ఞానభిత్ పేరు బ్రాకెట్ లో మరుల్ నీక్కియార్ అని ఇచ్చారు. బహుశ అది అనువాద పేరేమో. సంబంధార్ ని కలిసే దాక వాగీశుడు పేరుతో నే వ్యవహరించారు. జ్ఞాన సంబంధులు (Gnana Sambamdhar), ఈయన వయసులో తనకంటే పెద్దవాడవటం వల్ల వీరిని అప్పార్ అని పిలవడం తో అప్పార్ గానే ప్రఖ్యాత మయ్యారు. అందుచేత ఇకముందు అప్పార్ గానే వ్యవహిరిద్దాం.

కవిత్రయం లా సంబంధార్,అప్పార్,సుందరార్ ఈ ముగ్గురు నాయానర్ల లో ప్రముఖులు... వారి భక్తి సంకీర్తనలే ' తేవారం' గా
శివాలయాల్లో పాడుతారు.(Tevaram or Devaram which means garland of poems)

*' సంబంధార్ తనకోసం పాడాడు, సుందరార్ ధనం పై ఆశతోనూ, అప్పార్ నాపై భక్తి తోనూ పాడారని 'పరమేశుడే అన్నట్టు కూడా చెప్తారు.*

అప్పర్ ది దాస్య భక్తి. స్వతహాగా వ్యవసాయ నేపథ్యం ఉండటం వల్ల అతని కీర్తనలలోనూ అది కనిపిస్తూంటుంది. ఒకసారి మతం మారి తిరిగి స్వమతంలోకి వచ్చినందువల్ల అపరాధభావము అతనిని వెంటాడుతూ వుంది. ఈ కారణంగా అప్పార్ స్వామి జైనుల నుంచి ఎన్నో బాధలు పడ్డాడు. పల్లవరాజు సాయంతో వారు ఇతనిని ఉడుకుతున్న సున్నపు బట్టీ లో వేయిస్తారు వొకసారి. కాని, దైవప్రార్ధన తో చందనం లేపితం లా  కించిత్ కూడా కందకుండా బయటపడతాడు. మరోసారి ఏనుగుల చేత తొక్కించడమూ, విషాహారం తినిపించడం, అదీ విఫలమైతే పెద్ద బండరాయి నడుముకి కట్టి ఏటిలో పడవేయడం చేస్తారు. ఆ శివుడినే నమ్ముకొన్న తను అన్ని ఆపదలనుంచి బయట పడతాడు.
అతనిని వేధించిన పల్లవరాజు కూడా తనతప్పు తెలిసుకొని అప్పార్ స్వామి కాళ్లమీద పడి శైవమతం స్వీకరించి, జైనులనందరినీ బహిష్కరిస్తాడు.

*శివక్షేత్ర సందర్శన...*
మొదట పలుగు, పార తీసుకుని వీరాట్టేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి శివాలయ ప్రాంగణం లో గడ్డి,పిచ్చిమొక్కలూ పీకి మొత్తం పరిశుభ్రం చేశాడు. అది మొదలు వెళ్లిన ప్రతి ఆలయం అట్లాగే శుభ్రపరుస్తూ ముందుకు సాగాడు.  భక్తి ఉద్యమం అలా మొదలైంది అనుకోవచ్చు.  అలా వివిధ శివక్షేత్రములు సందర్శించు కొంటూ,  తన కవితా వైభవం తో శివస్తోత్రాలు చేసుకొంటూ వెళ్లాడు.
ఒక చోట *పెణ్ణాగడం* అనే ఊరిలో అక్కడ శంకరుడు సాక్షాత్కరించి అతని కోరిక పై తన భూతమునొకరిని పంపి శూలము,వృషభము చిహ్నాలు ముద్రింప చేశాడని పురాణ కధ.

 _ఇందుకు సంబంధించిన కవిత్వం నాకు  ఇంగ్లీషు లో లభ్యం అయింది. అది నేనునా అనువాదరూపంలో ఇస్తున్నా_

పద్యం:
అన్ని లోకాల్లో ఆతని రాజదండం శాసిస్తుంది
కైలాసం లో మాత్రం ఆయనే సర్వాధికారి
నీ పాదం కింద నలిగి అణిగింది దర్పం
హిమగిరి మంచుకొండలా ధవళ వన్నె గల
నీ వృషభ చిహ్నం నాపై ముద్రించు
ఓ నా నిజ దైవమా..
నన్ను  అనుగ్రహించు -
*తుంగనాయిమడం*
మా ఊరి ఆలయం  వెనక చెట్ల తోపుల్లో పైనుంచి
 నిశ్చలంగా వెలుగుతున్న చంద్రుడున్న చోట

శివ ముద్ర వేయించుకోవడం అంటే...తనను స్వామి ఆస్తి గా భావించుకోవడం. ఇంతకంటే దాస్య భక్తి వేరే ఉంటుందా?

నా ప్రభువు చరణ యుగళ ఛాయ లో
ఎలా ఉంటుందంటే.
శృతి చేసిన వీణ లా
సాయంకాలపు నిండు జాబిలి లా,
మందంగా వీచే దక్షిణ గాలి లా,
 ‎నవ వసంతం లా, తుమ్మెదల గుంపు
 ‎ఝంకారాలతో కూడిన సరస్సు లా

అతని గీతాల్లో వాడబడిన ఉపమానాలు గమనిస్తే ఏమనిపిస్తుందంటే...ఓ చక్కని పల్లె వాతావరణం.. తో పాటు కవి యొక్క వ్యవసాయపు నేపధ్యం తెలియవస్తుంది..

లక్ష్మీపతి విష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ.
నీ ఆద్యంతాలు వెతికినా
వారు నీ పాదాలు మాత్రం కాంచలేకపోయారు
అయినప్పటికీ, ' అతిహాయి' లో ఉండే ప్రభూ
నిరాకారా, కరుణామయా, నీ పాదారవిందాలు చూచే భాగ్యం ప్రసాదించవయ్యా!

_ఆద్యాంత రహితుడైన ఆ పరమేశ్వరుడు తనంత తాను ప్రకటితమవ్వాలి తప్ప...వెదకినా దొరకడని భావం._

 ఇలా అనేక గీతాలను సృజించి... పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొన్న తిరు అప్పార్  ఒకసారి ఒకరి ఇంట ఆతిథ్యం స్వీకరించ పోయినపుడు, ఆ గృహస్థు కుమారుడు పెరటిలో అరటి ఆకు కోయడానికి వెళ్ళి పాము కాటుకి గురి అవుతాడు. అయినా అ గృహస్థు విషయం దాచి ఆతిధ్యం ఈయబోగా, గ్రహించిన అప్పార్ స్వామి ఆ పిల్లవాడిని పవిత్రవిభూతి తో బ్రతి
 ‎కించిన కధ ఒకటి రమణులు వివరించారు.

ఆ తరువాత సంబంధార్ ని కలిశాక, తనను ఆయన తండ్రీ అని నిలిచినప్పటికీ,  తనను ఆయన శిష్యుడు గా ప్రకటించుకొని అతని కూడా అన్ని శివ క్షేత్రాలను తిరిగి భక్తి ఉద్యమం స్ఫూర్తి వంతం గా నడిపాడు.
 వేదారణ్యం వెళ్ళి నపుడు ఇద్దరూ తమ గాన మహిమ తో మూసి ఉన్న వేదారణ్యేశ్వర ఆలయ తలుపులు తెరచి, మళ్ళీ మూస్తారు. ఇందులో.. ఒక పరీక్ష లాగ, వాగీశ్వరుడైన అప్పర్ గేయ దశకమును గానం చేసి ఆలయ తలుపులు తెరవగా, సంబంధుల ఒక్క గేయంతొనే  మూయబడతాయి  తలుపులు.
న్యూనత చెందిన అప్పర్ ను, పరమేశ్వరుడు అనుగ్రహంచి అనునయిస్తాడట.

అప్పర్ స్వామి అక్కడ నుంచి, చిదంబరం, నాగపట్టణం, శ్రీపురాణసరిత్తు,మొదలైన క్షేత్రాలు దర్శించి, అక్కడి శైవేతరులను తన వాదనలతో ఓడించి, అరుణాచలం చేరుకొన్నాడు.
*స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద
కరుణామృత జలధి అరుణాచలమిది*
ఆ పైన కంచి,కాళహస్తి, శ్రీశైలం క్షేత్రాలు పావనం చేశాడు
అప్పార్ స్వామి దాదాపు ఎనభై ఏళ్లు జీవించాడు. తన జీవిత కాలంలో దక్షిణాన ఉన్న శివ క్షేత్రాల నన్నిటిని కాక -కాశీ, కేదార్‌నాథ్, తర్వాత కైలాస పర్వతం..ఎన్నో శ్రమలకు ఓర్చి చేరుకొన్నాడు  * సర్వం శివమయ జగత్* అంటూ అంతటా పరమేశుని చూసినవాడై, వెనుతిరిగి, మదురై,రామేశ్వరాది క్షేత్రాలు దర్శించుకొంటూ తిరుప్పహలూర్(Thiruppugalur)
చేరి ఉండగా, అతని సోదరి తిలకావతి దేహము చాలించిందని తెలిసి దుఃఖిస్తాడు. తిరుప్పహలూర్ లొనే ఉండి, అక్కడే శివసాయుజ్యం పొందుతాడు.

ఇంతటి మహోన్నత జీవితం గడిపిన  ' వాగీశుడు' అనబడే అప్పరు స్వామి చరిత ధన్యమైనది. విన్నవారికి,చదివినవారికి మోక్షసుఖం పొందుతారని, శ్రీ రమణులు శలవిచ్చారు.

పెరియ పురాణ కధలు-1

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

శ్రీ రమణులు చెప్పిన కధలు
పెరియ పురాణ కథలు_జ్ణానసంబంధుడు_1

పెరియపురాణం తమిళులు పంచమ వేదం లా భావించే  గ్రంధం.
శేక్కిళార్ అనే శివభక్తుడు తమిళంలో  అరవైముగ్గురు శివ నాయనార్ల  గురించి అప్పటి శైవభక్తి ఉద్యమం గురించి కూర్చి రచించిన మహా గ్రంధం.
 ‎
పెరియపురాణం రమణ భగవానుని జీవితం తో అనన్యంగా పెనవేసుకు పోయింది అంటారు.
" సర్వాంతర్యామి, సర్వ శక్తిమంతుడు, విశ్వానికి నియంత అయిన ఈశ్వరుని ముందు నిలబడి, నేనుకూడా అరువదిముగ్గురు భక్తుల వలె భక్తితో సుస్థిరుడనగుటకై అనుగ్రహము ను కురిపించుమని అపుడపుడు వారిని ప్రార్థంచేవాడిని." ఇది తరచు శ్రీ రమణులు మీనాక్షి సుందరుల సన్నిధిలో చేయు ప్రార్ధన అని తెలియజేశారు.

ఈ పురాణంలోని జ్ణానసంబంధులు,అప్పర్,సుందరమూర్తి ల కధలను భక్తులకు చెప్పేవారు.

దక్షిణ భారతంలో ఏడు ఏనిమిది శతాబ్దాల తర్వాత గొప్ప భక్తి ఉద్యమం జరిగిందని, దానికి నాయనార్లు, ఆళ్వార్లు శైవ, వైష్ణవ సాంప్రదాయ భక్తిని ప్రచారంలోకి తెచ్చారని,  మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను, రమణుల కధలు చదివి ప్రేరణ పొంది, ఇంకా వికీపీడియా ద్వారా కొంత,తెలుసుకున్నాను.  ఇంకా వీటిలో లో కొన్నటికి ఇంగ్లీషు ట్రాన్స్ లేషన్ చదివాను. ఫలితంగా... నేనే కొంత తెలుగులో రాసుకోవాలని, అవి మీతో పంచుకోవాలని, అనిపించింది. ముఖ్య ఆధారం మాత్రం రమణుల కధలే.

12వ  శతాబ్దంలో  శేక్కిళార్ అనే కవి చోళ రాజ సంస్థానంలో ప్రధానమైన మంత్రి గా ఉంటూ కుళోత్తుంగ రాజు సహకారంతో పద్య సంకలనం కార్యక్రమం చేపట్ఠాడు.
#పెరియపురాణం పద్య సంకలనం మొత్తం పన్నెండు వాల్యూమ్ లు.   ఈ పద్య సంకలనం లో మొదటి ఏడు వాల్యూములు 'తేవారమ్' అంటారు

అయితే ఈ ఏడు వాల్యూమ్ లు సంబంధార్,అప్పార్,సుందరార్ రచనలు.. తమిళ కవిత్వం లో.. వీరు మన 'కవిత్రయం' లా  అన్నమాట. సంబంధార్ ది వాత్సల్య భక్తి, అప్పార్ ది దాస్య భక్తి, సుందరార్ ది మధురభక్తి...

తేవారమ్ అంటే భగవంతుని స్తుతించే పద్యమాల. ఈ తేవారమ్ తమిళనాట అన్ని శివాలయలలో పాడే సంప్రదాయం నెలకొంది.

కథాకాలం ఏడవ శతాబ్దం పూర్వార్ధం. జైన,బౌధ్ద మతాలు ఉచ్చ స్థితిలో ఉన్నరోజులు.  దక్షిణ భారత ప్రాంతాన ఏలే పాండ్యరాజు
జైనమతం స్వీకరించాడు. రాజప్రాపకం లభించడంతోనే, వేద సంప్రదాయం అడుగంటింది. శైవ వైదికం దైన్యస్థితిని అనుభవిస్తూ ఉద్ధారకుని కోసం  ఎదురు చూస్తోంది.

అది  కావేరీ నది ప్రాంతం. కావేరీ నదికీ చిదంబరానికి మధ్యనున్న ప్రాంతం. 'శీర్ కాళి' అనే ఊరు. శైవ సనాతనానికి, సంప్రదాయానికి ఆలవాలమైన ఆ ఊరికి ద్రోణీపురం అనిపేరు కూడా ఉంది.

ఇక  ద్రోణీపురపు పల్లె పచ్చదనం, అక్కడి ప్రకృతి చేసే  సందడి.. రసజ్ఞుడైన కవి హృదయాన్ని దోస్తుందిట. అక్కడి చెరువుల లో పద్మాలు, చేలగట్ల వెంట ఉన్న మడుగుల్లో విరిసే తెల్లకలువలు, పూల తేనెలతో మత్తెక్కిన తేనీటీగల సంగీతం... ఇదీ నేపథ్యం.

ఆ ఊళ్ళో 'శివపాద హృదయుడు' అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య భగవతి. సంతానం లేకపోవడంతో, సంతానంకోసం ద్రోణీపురీశుని ప్రార్థించగా,భగవతి కి శివుడు కలలో కనిపించి, బంగారు గిన్నె లో పాయసాన్ని ప్రసాదించాడు.  కొన్నాళ్లకు ఆమె పండంటి మగ బిడ్డను ప్రసవించింది."

శివపాదహృదయుడు, భగవతులకు పుట్టిన ఆ బాలునికి #ఆళుడయ_పిళ్ళై అని నామకరణం చేశారు. పిల్లవానికి మూడు ఏండ్లు వచ్చాయి.

ఇది ఇలా ఉండగా..,

ఓనాటి  ధనుర్మాసపు ఉషోత్కాలపు వేళ ఒక అద్భుతం జరిగింది. అప్పటికి ఇంకా సరిగా తెల్లవారలేదు. పుష్కరిణిలో స్నానానికి బయల్దేరాడు శివపాద హృదయుడు. చలి అని వారిస్తున్నా వినకుండా వెంటబడిన, కుమారుని తన భుజం పై కూర్చో బెట్టుకొని వెళ్లాడు.

దారి అంతా పొగమంచు తో నిండి నిశ్శబ్దం గా ఉన్నది. ఆలోచనలు, మాటలు లేని ఒక అలౌకిక  స్థితి లో నడుస్తూ వెళుతున్నాడు అతను. ఉండుండీ దూరం నుంచి, గాలివాటుగా వినవస్తున్న వేదమంత్రోచ్ఛారణలు, పుష్కరిణి లో స్నానాలు చేస్తూ, ఆడవాళ్ళు పాడే భక్తి గీతాలు.. ధ్యాన మగ్నుడై ఉన్నాడతను.

పుష్కరిణి  చేరగానే, కుమారుణ్ణి  గట్టు మీద కూర్చో పెట్టి, తను పుష్కరిణి లో స్నానం చేయడానికి వెళ్లాడు.  కొద్ది సేపటికి స్నానాదులు అయ్యాక వచ్చి చూసేసరికి పిల్లవాని పెదిమల చుట్టూ పాలచారికలు. ఎవరిచ్చారయ్యా..పాలు అని తండ్రి ఆశ్చర్యం తో ప్రశ్నించాడు. గుడి గోపురం వైపు చూపించాడా పిల్లవాడు. ఎన్నిసార్లు అడిగినా అటే జగన్మాత వైపు చూపించసాగాడు. అంతే కాదు... అందరికీ ఆశ్చర్యం గొలిపేలా, హృద్యంగా ఒక గీతాన్ని పాడడం మొదలుపెట్టాడు. ఛందోబధ్దమైనది కూడా. మూడేళ్ల పిల్లవాడు కవితాగానం ఏమిటి.
అప్పుడర్ధమైంది తండ్రికి. జగన్మాత తన బిడ్డకి పాలిచ్చి ఆకలి తీర్చింది అని.  మానవ రూపంలో గురువు లేకుండా, సరాసరి ఈశ్వర సంబంధము చేతనే జ్ఞానోదయమైన కారణంగా, నాటినుంచి జ్ఞాన సంబంధుడని ప్రఖ్యాతి చెందాడు.


మూడేళ్ల పిల్లవాడు తన కవితాగానం తో ద్రోణీపురీశునికి(శివుడు) ప్రీతి గొలిపేలా తన చిన్ని చిన్ని పాదాలతో చిందులు వేశాడు.

అది మొదలు తన తండ్రి భుజాన ఎక్కి చుట్టుపక్కల ఉన్న శివ క్షేత్రాలను దర్శిస్తూ,  అక్కడ తన గాన రసామృతం తో శివుని ప్రసన్నం చేసుకోసాగాడు. ఈ బాలకుడేమో కారణ జన్ముడు‌ సాక్షాత్ పార్వతీ దేవి అక్కున జేర్చుకొని అతడిని ఆశీర్వదించింది.  ఒక క్షేత్రం నుంచి మరొక క్షేత్రమునకు పోయే దోవలో  శివసందర్సనోత్సాహంతో ఈ పిల్లవాడు పదాలు పాడుతూ, చిందులు వేస్తూ తోటి పథికులను ఉత్సాహ పరచేవాడట.

ఆ సమయంలోనే, నీలకంఠుడనే  వైణిక నిపుణుడు సంబంధుని సాక్షాత్ శివునిగా భావించి, సంబంధులు రాసిన గీతాలను తన వీణపై మధురంగా  ఆలపించేవాడు. ఇదొక భక్త బాంధవ్యం.

శివపాద హృదయుడు బాల సంబంధునకు సకాలం లో ఉపనయనం చేశాడు. సంబంధుడు గురు ముఖతః చతుర్వేద వేదాంత ఆగమాలను ఆకళింపు చేసుకొన్నాడు.

" సకల వేదాలసారము   ' పంచాక్షరీ ' యే అని అనుభవ పూర్వకంగా గ్రహించాడు. పంచాక్షరీ పదికాన్ని నిబద్ధించి గానం చేశాడు."

ఇలా ఉండగా,  అప్పరు అనే వృధ్ధుడైన శివభక్తుడు సంబంధులను కలుస్తాడు. సంబంధులోని ప్రౌఢ కావ్యశక్తికి ఆశ్చర్యం పోయి అతని శిష్యుడు అవుతాడు కాని చిన్నవాడైన సంబంధులు అతనిని అప్పర్‌...అనగా తండ్రీ! అని సంబోధించి అక్కున చేర్చుకొంటాడు.

అప్పర్ మహా శివభక్తుడు. పెరియపురాణం లో అరవై ముగ్గరు నాయనార్ల లో మొదటివాడు.   కొంతకాలం జైనమతం తీసుకొని తన సోదరి ద్వారా కనువిప్పు కలిగి తిరిగి శైవమతం లోకి వస్తాడు. అప్పటి ఆతని ఉద్యమ కాంక్ష  అధికార ప్రాపకం ఉన్న జైనీయులని తరిమి కొట్డడం (అప్పర్ చరిత్ర విడిగా వివరిస్తాను).
సంబంధులు వంటి మహా భక్తుల తోడు కోసం చూస్తున్నాడు.  మరో దైవానుబంధం.  ఇద్దరూ కలసి అనేక శంకర క్షేత్రాలను చూస్తూ, స్తోత్రపరమైన సేవలనందిస్తూ ముందుకు సాగి పోతున్నారు.

అది ఏడవ శతాబ్దం మొదటి అర్ధశతం‌...కాలం. పాండ్యరాజైన కుబ్జపాండ్యుడు మొదట మధురా క్షేత్ర దైవమైన సుందరశివుని భక్తుడైనా, జైనమతాన్ని ఆదరించి, మతం మార్చుకొన్నాడు. కాని అతని పత్ని మహిళేశ్వరి, వారి మంత్రి కులబంధనుడు  శివ భక్తులు.  మతము మారలేదు. కాని రాజ్యం లో నెలకొని  ఉన్న పరిస్థితి కి కలత చెంది ఉంటారు.   మంత్రి జ్ఞాన సంబంధుని భక్తి చరిత విని ఉండటంతో మహారాణిని సంప్రదించి జ్ఞాన సంబంధులను తమ రాజ్యానికి ఆహ్వానిస్తారు.
జ్ఞాన సంబంధుడు తన భక్త పరివారంతో పొలిమేరలోనే, వేగవతీ నదీ తీరాన ఏర్పాటు చేయబడిన శైవమఠంలో బస చేస్తాడు. తనను పిలిచిన కారణం మంత్రిని అడిగి తెలుసుకొంటాడు. అక్కడ మీనాక్షీ సుందరేశ్వరుల ఆలయం దర్శించుకొని..  మీనాక్షీ దేవి హృదయం కరిగేలా ద్రావిడ కవితల తెలి దండను సమర్పించాడు.
జ్ఞాన సంబంధుని రాక  తెలిసిన జైన సిద్దాంత కర్తలు  మారణ మంత్రాన్ని ఒక భీషణ జ్వాలాగ్నిగా అతనిపై ప్రయోగిస్తారు.  ఆ శక్తి, సంబంధుని ముందు తనప్రభావాన్ని కోల్పోతుంది. తిప్పికొట్టబడిన ఆశక్తి చివరకు పాండ్యరాజును ఆవహించి జ్వరగ్రస్తుడిని చేస్తుంది.  అయితే జైన వైద్యులు నయం చేయగలిగిన బాధ కాదది. మహరాణి పిలవగా సంబంధులు వస్తారు. భస్మ మహత్యం తెలిపే #గేయపదికను గానం చేసి కొంత విభూతి రాజుపై చల్లాడు. కొంత చల్లబడింది రాజుకు.

జైనులు సంబంధుల పై విశ్వాశ పరీక్ష కోరుతారు. అందుకు అంగీకరించిన రాజు సగ దేహం జైన వైద్యులు మిగతాసగభాగం శివదీక్షాపరుడైన సంబంధులు వైద్యం చేయాలి. ఫలితంగా  జైనుల వైద్యం పనిచేయక అవస్థపడిన రాజుకు మన సంబంధులు తన మధుర గానామృతం ద్వారా పూర్తి స్వస్థత ఇస్తారు. రాజు సంతోషిస్తాడు.

ఈసారి మరో రెండు పరీక్షలకు రాజుని ఒప్పిస్తారు జైనులు.

మొదటి ది:  తాటి ఆకుపై తమ సిధ్దాంతాలను రాసి మంటలో వేయాలి. *"శివుడే పరదైవం... ఓం నమఃశివాయః, శివఃశరణమ్" * అని సంబంధులచే వ్రాయబడ్డ తాటి ఆకు మాత్రము  అగ్నిలో వేసినా కాలదు.

ఇక రెండవ పరీక్ష: ఈసారి తాటిఆకులను వేగవతీ నదీ ప్రవాహంలో వదలాలి. సంబంధుడు వెనకటిలా రాసిన తాటి ఆకు ఏదో చైతన్యం ఆవహించినట్లు,నిపుణుడైన నావికుడు నడిపే నావలా ముందుకు సాగింది.  జైనులు వ్రాసినది  మాత్రం ఏదో సుడిగుండం లో చిక్కుకొన్నట్టు మరి కనిపించలేదు.

పాండ్య దేశం లో మత ప్రక్షాళన జరిగింది. పాండ్యరాజు తిరిగి శైవమతం స్వీకరిస్తాడు. ఓడిపోయిన జైనులకు మంత్రి నేతృత్వం లో శూలారోషం (impaled) చేయబడింది.  శైవులు మరీ విజృంభించి,  జైన చిహ్నాలైన చైత్యాలను ఆరామాలను ధ్వంసం చేశారు. ప్రక్షాళన తర్వాత, ఆప్రాంతంనికి జ్ఞానసంబంధుని వైభవమునకు చిహ్నంగా శ్రీ జ్ఞానసంబంధ పురము అని పేరు పెట్టారు.

మధురై తర్వాత జ్ఞానసంబంధార్ ఇంకా కొన్ని ఇరుగు, పొరుగు రాజ్యాలలో శైవమతం ప్రచారం చేపట్టాడు. *అప్పర్* తో కలసి అన్ని పుణ్యక్షేత్రాలు, శ్రీ కాళహస్తి, రామేశ్వరం తో సహా సందర్శించాడు.

జ్ఞానసంబంధార్ పుట్టుక కు బ్రాహ్మణుడు కాని,అతనికా బేధ భావం లేదు.  తన భక్త బృదంతో ఊరూరా తిరిగినపుడు, యజ్ఞవాటికలలో అగ్ని ఆరిపోతుందని వారి రాకకు అభ్యంతరం చెప్పేవారట,అందరినీ అక్కడికి తీసుకు వెళ్ళి వారిచే పాడించి...చూడండి మీ హోమాలు ఎలా ప్రజ్వరిల్లతున్నాయో అనేవాడట.
 ఇక సంబంధార్ కి పదహారేళ్ళ వయసు రాగానే వివాహం తలపెట్టారు..అతనా అల్పాయుష్కుడు. వివాహ తంతు ముగియకుండానే, స్వామి పిలుపు. వధువుతో,మరికొంతమంది తో స్వామి లో ఐక్యమయ్యాడా భక్తుడు. అజరామరమైన తన కవిత్వం ద్వారా వేల సంవత్సరాలైనా చిరస్మరణీయుడు ఆ మాహానుభావుడు.
🙏🙏🙏


జ్ఞాన సంబంధార్ కవిత్వం గురించి..రెండు మాటలు..కొన్ని పద్యాలు

జ్ణాన సంబంధార్ తన మూడవ ఏట పార్వతీ దేవి చనుబాలు  తాగడం,  ఆశువు గా భగంవతుని  గద్యం చెప్పగలగడం అభూతక ల్పనలా కనిపిస్తుంది.  అసలు శివ భక్తులైన ఈ అరవై ముగ్గురు నాయనార్లని ఆశ్రయించి ఇలా ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి.
దీనికి తోడు కేవలం తన భక్తి పాటలద్వారా  జైనమతం కూలదోశాడు అన్నదీ తేలికగా నమ్మలేం. అయినప్పటికీ, వ్యక్తులు వాస్తవ చారిత్రక సత్యం కదా. వారి రచనలూ అంతే.

ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. రమణుల కథలు చదువుతూ నేను కొంత పక్కకు వెళ్లే సాహసం చేసాను. భక్తి ఉద్యమం గురించి తరచి తెలుసుకోవాలని అనిపించింది.

తేవారమ్ అంటే భగవంతుని స్తుతించే పద్యమాల. ఈ తేవారమ్ తమిళనాట అన్ని శివాలయలలో పాడే సంప్రదాయం నెలకొంది.

సంబంధార్ కవిత్వం ఆత్మాశ్రయ మైనది అంటారు. జన బాహుళ్యానికి అర్ధమయ్యే రీతిలో రాసినా  పద్య నడక సంస్కృత నడకను కాస్త పోలి అతిశయంగా ఉంటుంది ట. ఇంగ్లీషు translation వల్ల కాని, అదే మనం తెలుగులో చెప్పుకొన్నా తమిళ మూలానికి పూర్తి న్యాయం జరగదు. జానపద భాషలో సామాన్య ప్రజల్లోకి చొచ్చుకు పోయేవిధంగా ఉంటాయి ఈ గీతాలు. మొదటి సారిగా తమిళ భాష తెలిస్తే ఎంత బాగుండును అనుకొన్నా.
నా అభిరుచి కొద్దీ కొన్ని పద్యాలు,ఇంగ్లీష్ నుండి అనువదించే సాహసం చేసాను


1.అతని చెవులకి కుండలాలు
తాను తిరుగాడేది ఎద్దు పైన
అతని శిరస్సు చంద్రవంక రేఖాకాంతి  తో
               అలంకరించబడింది
ప్రజ్వరిల్లుతున్న  మరుభూమి లో   రేగిన బూడిద తో ధవళ వర్ణం లో ఉన్నాడతడు
నా హృదయం హరించుకు వెళ్లి న దొంగ ఆతడు.
 విరసిన కమలం లో విరాజమానుడై ఉండే బ్రహ్మ..మన ప్రభువు కి శిరసు వంచి స్తుతిస్తూ స్వాగతించాడా బ్రహ్మపురి నివాశిని.(శివుని)
 ( సంబందార్ ఊరైన శీర్ కాళి లేదా ద్రోణీపురం  పాత పేరు బ్రహ్మ పురి ట... పుష్కరిణి పక్కనే ఉన్నది శివాలయం)

His ears are beringed
He rideth the bull
His head is adorned with the crescent moon's ray
White is he with ash from the burning grounds swept
And he is the thief who my heart steals away
Great Brahma enthroned on the lotus full bloom
erstwhile bowed him down and his glory extolled and singing received the grace of our Lord who dweleth in famous Brahmapuram old.


2. ఓ  శ్వేత వర్ణీ...భీతహరిణేక్షిణీ,
ఓ పాండ్యుల మహారాణీ,
పాలుతాగే పసి బాలుణ్ణి, బలహీనుడిని అనుకోకు సుమా,
శతృవులెంత దుర్మార్గులు అవనీ
హరుడు నాచెంత నిలబడి తే చాలు
వారందరి కన్నా బలవంతుడిని నేనే.

3. ఆ బౌద్ధులు, ఉన్మాద జైనులు ఏదైనా వాగనీ,నిందించనీ
      ఆ వదరుబోతు తనము వారికే గుణపాఠం కాగలదు
 3. ఈ భూమి మీదకొచ్చి..ఎవరైతే భిక్షాటన చేశారో
     అతనో దొంగ..నా హృదయాన్ని దొంగిలించుకు పోయాడు.
     తనను తరుముకొచ్చిన మదపుటేనుగు..
     చర్మాన్ని ధరించాడు కదా! పిచ్చివాడంటారేమో జనాలు       తానైతే ఈ మహా బ్రహ్మ పురం అంతా కట్టుబడి ఉండే ఏలిక

4.  తను పీఠాన్ని అధిష్టించిన ఆలయంలో....
ధైర్యం కోల్పో వద్దంటూ అతను ఓదార్చుతాడు..
ఎపుడైనా అంతా అయోమయమై,దారులన్నీ మసగబారినపుడు..మన బుద్ది మందగించినపుడు, ఊపిరాడకుండా గొంతున శ్లేష్మం అడ్డుకొన్నపుడు

5. తిరువాయూరు లో  ఎక్కడైతే పడచుపిల్లలు నృత్యం చేస్తూంటారో, తోడుగా, మృదంగ ధ్వనులు వినిపిస్తుంటే.  వానకురుస్తుందేమోనని కోతులన్నీ  చెట్లెక్కి మబ్బులని పరికిస్తాయి.

6. అరూర్ లో ఉండే తండ్రి
నీపై ప్రేమజల్లు కురిపిస్తే కనక
నీ హృదిలో నిజమైన జ్యోతి ఉదయిస్తుంది
బంధాలన్నీ పటాపంచలవుతాయి.

7. అరూర్ లో పవిత్ర మూర్తి యాతడు
అతనిని స్తుతించడం మరవకు సుమా
భవబంధాలన్నీ తెగి పోతాయి
తతిమా ప్రాపంచిక విషయాలు వదిలి వేసి

8. అరూర్ లో మా ప్రియతముడొక మాణిక్యం.
బంగారు కాంతులని విరజిమ్ముతాడు
నీ దుఃఖాన్ని తుడిచి వేసుకో
ఇక నీ ఆనందానికి మరో పోలికే లేదు


Monday, 28 January 2019

Book review

ILLUSIONS

"And what would you do" 
the master said unto the multitude
"If God spoke directly to your face and said,
' I command that you be happy in the world,  as long as you live'. What would you do then?"

"And the Master said into the silence, 'in the path of our happiness shall we find the learning for which we have chosen this life time. So it is that I have learned this day, and chose to leave you now to walk your own path,as you please.'.... and he returned to the everyday world of men and machines.."

           __the adventures of a Reluctant   Messaiah
                                                        _by Richard Bach

Is it possible to take your life in your control? Is everything you perceive real? Do miracles happen?

'What if somebody came along who could teach me how my world works and how to control it? ... What if a Siddhartha or Jesus came into our time, with power over the illusions of the world because he knew the reality behind them? And what if I could meet him in person, if he were flying a biplane, and landed in the same meadow with me?'

I  read this book some 20 years back. I read it again now with the same interest  for the second time too. It is a kind of sequel to his first book Jonathan Livingston Seagull.

It begins with an epilogue, a beautiful narration about  the arrival of Messiah. Here, in this first chapter, the numbered manuscript paras  with smudged pages, give a strange feeling of authenticity of an epic.  While your eyes run along the lines..your mind sees the magic unfolding. it is to let go of the clinging, experience the freedom of floating along the downstream.

Disillusioned with the masses who constantly seek his miracles than what he had to teach, Donald William Shimoda quits his job as Messiah and goes back to his mechanic job.

He says that there is nothing called a 'miracle', but only an illusion of magic of a magician, which anyone can repeat. The reality that we perceive is in fact, an illusion.

This has reminded me of preachings of  J.Krishna Murthy, our Indian philosopher, who came out of the religious shackles early in his career and went on lecturing on the freedom and choices.

There is again a 'Handbook of Messiah'  with interesting quotes. The book opens with the relevant quote for Richard to learn while the reality unfolds for him..by the master Donald William Shimoda. Both of them are in the business of flying people for few dollars. eventually, their association turns into Master and student relationship.

Ironically, the Messiah.. the protagonist dies in the hands of a random flier for his Antichrist statement

Sunday, 27 January 2019

గయ లో మా అనుభవాలు

22/11/2018

అయోధ్యలో ట్రైన్ గంటన్నర ఆలస్యం!  అలా మరో గంట పొడిగింపు. చివరకి ట్రైన్ వచ్చింది. మాది స్లీపర్ కోచ్.. ఈమధ్య అలవాటు తప్పిందేమో, లోపల ఉన్న చెత్త అదీ,  సర్దుకోవడానికి సమయం పట్టింది. అందరి పరిస్థితి అదే. ‌

మర్నాడు గయ స్టేషను లో మాకెవరికీ లగేజ్ మోసే ఓపిక లేక పోర్టర్ ని పిలిచిచాం‌‌‌‌... Where would you like to go ... అంటూ కాస్త సర్ప్రైజ్  చేస్తూ, ఓ మధ్యవయసు పోర్టర్ బేరం ఆడాడు.  బయటకు వచ్చాక మేం వెళ్లవలసిన చోటికి తనే ఆటోలు మాట్లాడిపెట్టాడు.

మా బాంక్ హాలిడే హోమ్స్ అక్కడి కి, అంటే స్టేషన్ కు చాలా దూరంలో ఉన్న బుద్దగయ లొ ఉన్నాయి. వెళ్లడానికి  దాదాపు ముప్పావు గంట పట్టింది.  మా ప్లాన్ ప్రకారం ఆరోజు దర్శనాలు అవీ పూర్తి చేసుకొని, ఆ రాత్రి కే కాశీ కి ట్రైన్.  మేం వచ్చిన ఆటోల వాళ్ల తోనే మొత్తం డీల్ మాటాడుకున్నాం. అన్నీ తిప్పి, తిరిగి రైల్వేస్టేషన్ లో దింపాలని.  అలాగే ఫ్రెషప్ అయి బయలు దేరాం..

అష్టాదశ శక్తి పీఠాల లో వరుస క్రమంలో పదాహారవ ది గయ లోని మాంగల్య గౌరీ శక్తి పీఠం. సతీ దేవి స్తన భాగం ఇక్కడ పడిందని పురాణం. సర్వ మంగళ మాంగల్యే...శివే సర్వార్ధ సాధకే త్రయంబకే ,దేవీ నారాయాణి నమోస్తుతే...!

మొదట మాంగల్య గౌరీదేవి దర్శనం. కొంచెం క్యూ ఉంది. కాని దర్శనం బాగానే అయింది. ఒక చిన్న గుడారపు ఇల్లు లా కిందికి వుంటుంది.ద్వారబంధం దగ్గర, గర్భగుడిలో బాగా వంగి వెళ్లాలి. లోపల  హారతి  వెలుగు లోనే అమ్మవారిని దర్శించుకొన్నాం.

అటునుంచి గయ. ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే వారు ఉత్తమ గతులు పొందుతారని, వారికి మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం.  గయుడు అవడానికి రాక్షసుడైనా, విష్ణు భక్తుడుట. విష్ణుమూర్తి వల్ల వరం పొందుతాడు. మూడు భాగాలుగా విష్ణుమూర్తి చే ఖండింప బడిన గయుని శరీర భాగాలలో, శిరస్సు బీహార్ లో గయ లోను, నాభి భాగం ఒరిస్సాలో జాజి పూర్ లోను, పాదాలు  ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం లో  పడ్డాయని పురాణం. ఇక్కడ  విష్ణుమూర్తి పాదం మోపిన స్థలం కనుక, విష్ణుపాద ఆలయం ఉంది. ఆ పక్కనే పిండప్రదాన కార్యక్రమాలు జరుగుతాయి.

మా గ్రూప్ లో  ఓ ఇద్దరు ఈ కార్యక్రమాలు అవీ చేయించు కోవాలని అక్కడ ఆంధ్రాశ్రమానికి వెళ్లాం. వాళ్ళు ఇందుకొసం ఓ పండిట్ ని మాట్లాడారు. అక్కడి అతనే.
వాళ్లిద్దరూ ఆ పనిలో ఉండగా, మిగతా వాళ్లం ఆలయం లోపలి కి వెళ్లాం.  'శుభ్రత' అంటే ఏమిటి అన్నట్లు ఉంది లోపల . అంతా,తడి మట్టి కాళ్లతో వస్తున్నారేమో గర్భాలయం కూడా జారుడు గా ఉంది.  విష్ణు పాదం దగ్గర వంగి దండం పెడుతూంటే, ఉన్నట్టుండి తోపులాట..నేను పైకివలేవలేక పోయాను చాలా సేపు.
ఆ తర్వాత వెనక అశ్వత్థ వృక్షం ఉంటే..వెళ్ళి చూశాము. పచ్చని చెట్టు.. పక్షులు వాలి పైన సందడి చేస్తున్నాయి... కాని కింద మనుషులు చేసిన ధ్వంసం... ఎవరికి చెప్పుకోను నా సంగతి అని అడుగుతున్నట్టు ఉంది.  దీనికి ప్రబలమైన కారణం ఉంది. దేశం మొత్తం  హిందువులు అంతా విధిగా  గయ లో పిండ ప్రదానం చేస్తారు. అందువల్ల యాత్రీకుల తాకిడి విపరీతం. ఇలా కాక మరెలా ఉంటుంది అనిపించింది.

వెనక కు వెళ్ళి నపుడు ఫల్గూ నది కి దారి అని బోర్డు చూసి వెళ్లబోతుంటే..నది అని పేరేకాని, నీళ్ళు లేవు అన్నారు. అయ్యో అని ఆగి పోయాం. ఇవతలకు వచ్చాక మా ఆటో అతను, పేరు 'మనోజ్ పాండే',  అసలు మీరు చూడాల్సిన ప్రదేశం ఇదే  అని చెప్పి మాకు  స్థల పురాణం చెప్పాడు.
సీత,లక్ష్మణ సమేతంగా శ్రీ రాముడు వచ్చి అక్కడ తన తండ్రి దశరథునికి ఉత్తర క్రియలు చేయడానికి వచ్చాడట. రామలక్ష్మణులు స్నానానికని వెళ్ళి నపుడు, దశరథుని చేతులు రెండు సీతముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఉన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడుగగా , సీతాదేవి పిండములు తీసి ఆచేతులలో ఉంచిందిట. తరువాత శ్రీ రాముడు రాగానే సీతాదేవి ఆవిషయం చెబితే రాముడు ఆశ్చర్యపడతాడు..సాక్ష్యం చెప్పడానికి పిలిస్తే నదీ పలకదు, అక్కడ గోమాతా ఉలకదు..బ్రాహ్మడు కూడా ఏం మాడ్లాడడు. కాని అక్జడి రావి చెట్టు సాక్ష్యం ఇస్తుంది. అపుడు సీతాదేవి కోపంతో శపిస్తుంది ట. నదిని శాశ్వతంగా ఎండిపొమ్మని, అక్కడి బ్రాహ్మలంతా కక్కుర్తి తో ఎప్పటికీ ఒకరి ముందు చేయి చాచే ఉంటారని...(ఏదో తీవ్రమైన పదం వాడాడు హిందీలో)... ఈ చివరి మాట అంటూంటే పాండే గొంతు మారిపోయింది.. కొద్దిగా జీర. అవును. అతను 'పండిట్' అని మరో ఆటో డ్రైవర్ చెప్పాడు. అతనితో అందరం ఎండిన ఫల్గునీ నదిని చూశాం.
పురాణ కథ మాటేమోగాని ఆ దృశ్యం..  ఇంకా మా పాండే ను గమనించాక  ఎంతో బాధ కలిగింది.  పండాలు పీడిస్తారు అని ఈసడించుకొంటూనే ఉంటారు కదా..

 ఇలాగే ద్వారక వెళ్లినపుడు ఓ పండిట్ అన్నాడు.
'మీకు తోచిన దక్షిణ ఇవ్వండి. కాని ఇక్కడి పండిట్ లు పీడిస్తారని బయట కు వెళ్ళి అనకండి' అని. మనం కొన్ని కొన్ని సందర్భాలలో పెట్టే ఖర్చు తో పోలిస్తే,ఇంత దూరం వచ్చి కాస్త వితరణ చూపిస్తే ఏం  అని అనిపించింది.
సరే ,రావి చెట్టు ను చూశారా.‌‌..సీతమ్మ దగ్గర శాశ్వతత్వ..వరం పొందింది కానీ...మనఁవే బతకనిచ్చేట్టు లేం.

అక్కడ్నుంచి బోధగయ. ఇక్కడ మాత్రం లోపలికి ఫోన్లు కెమెరాలు ఏమీ అనుమతించరు. గట్టి నిఘా ఉంది.
ఆ రోజు నవంబర్ 22 వ తారీఖు. పౌర్ణమి ఘడియలు వచ్చేయేమో, చల్లగా, ప్రశాంతంగా ఉంది. ఎత్తైన మెట్లు. దిగి వెళ్లాలి.  అక్కడనుంచే లోపలి బంగారు బుద్ద విగ్రహం దర్శనం అయింది. పెద్ద క్యూ . బుద్ధదేవుడుని మనసులో నే స్మరిస్తూ లోపలికి వెళ్లాం.

లోపలంతా చాలామంది బౌద్ధులు ప్రార్థనలు చేసుకొంటున్నారు వెనక ఉన్న బోధి వృక్షం దగ్గర కూడా చాలా మంది ఏదో జపిస్తూ ఉన్నారు.   బోధిచెట్టుకు  చుట్టూ ఇనుప కంచె.  కూర్చుందుకు కూడా స్ధలం లేదు.  అలా నిలబడే చూస్తూ.. ఇది  బుద్దభగవానుడు నడిచిన పవిత్ర స్థలం కదా అనుకోగానే మనసుకు కలిగిన పరవశం ..ఏం చెప్పను.
బుద్దుని బోధనల లాటి లోతైన విషయాలు..తాత్వికత  గురించి నేను చెప్పలేను కాని,  చిన్నప్పటి నుంచీ విన్న బుద్ధుని కధలు, బుద్ధభగవానుని పట్ల పెంచుకొన్న ఆరాధన.
"కోరికలే దుఃఖానికి మూలకారణం" అని  ఎంతో పదిలంగా చిన్నపుడు నోట్ బుక్ లో రాసుకొన్న కొటేషన్. ఆ నిమిషం లోనే అన్నీ గుర్తుకొచ్చాయి.  కొన్ని సెకన్ల పాటు ఆ జ్ఞాన మూర్తి కి మనసు లోనే నమస్కరించి బయటకు వచ్చా అందరితో కలసి.
ఆ ప్రదేశాన్ని అంత త్వరగా వదలడానికి మనస్కరించలేదు. కాని, మేము ఆ రాత్రికే  ట్రైన్ లో కాశీ కి వెళ్లాలి. తప్పదు కదా.
అకడ్నుంచి మళ్ళీ పరుగు. గెస్ట్ హౌస్ కి వెళ్ళి లగేజ్ తెచ్చుకొని తిరిగి అవే ఆటోల్లో స్టేషను కు. చిరునవ్వు తో మాకూడా ఉన్న ఆ ఆటో డ్రైవర్స్...ముఖ్యంగా నేను ఎక్కిన...ఆటో లో మనోజ్ పాండే ని మాత్రం మరచిపోలేను.











కాశీ— దేవఘర్

కాశీ -దేవ్‌ఘర్

నవంబర్ 23.
గయనుంచి కాశీకి

తెల్లవారుజాము నాలుగు అవుతుండగా కాశీ స్టేషన్లో దిగాం.
కాశీ అంటేనే వెలుగు. ఓ తేజస్సు.
బయటకు వచ్చి చూస్తే..... ఇదిగో ఇలా,  గాజు దీపాల వెలుగు .
గుంపులు గుంపులుగా చలికి ముడుచుకొని ఉన్న ప్రయాణీకులు ఓ వైపు.  అలా  పరిసరాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఉండగలగడమే , అసలైన యాత్ర.  అదీ.భక్తీ,శ్రద్ధ.

మేం అటోలు చేసుకొని,  ముందు గా రూం లు బుక్ చేసుకున్న
శృంగేరి మఠానికి వెళ్లాం.  ఆ రోజు కార్తీక పౌర్ణమి. గంగా నదీ స్నానాలు. వెంటనే రెడీ అయి కేదార్ ఘాట్ దగ్గర కు వెళ్లాం. స్నానాలు,నీళ్లలో దీపాలు. ఒకప్పుడు ఏమిటీ వెర్రి అనుకొనేదాన్నే.  అలా అందరి తోపాటు నీళ్ల లోమునకలు వేస్తూ ..ఉనికిని మరచిపోయే స్థితి. నమ్మాలి.

పగలంతా కాశీ పట్టణ సందర్శన.  బిర్లా మందిరం. BHU.  ఆరోజు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్నాతకోత్సవాలు. పిల్లల తో ఏం సందడి. సరదాగా కొంతమంది తో ఫోటో తీయుంచు కొన్నాము. ఆ యూనివర్సిటీ లో చదవాలనే కోరిక ఉండేది అదిలా తీరింది అంటూ సుజాత అని ఒక ఫ్రండు మహా సంబరపడింది.
తర్వాత, కొన్ని ఆలయాలు,సంకటమోచన్ హనుమాన్, తులసీ మందిరం.. ఇట్లా. విశేషం ఏమిటంటే, ప్రతీ గుడి దగ్గర అక్కడ అమ్మకునే వాళ్లు. మమ్మల్ని గమనించి తెలుగులో మాట్లాడటం.. ఎక్కువగా చిన్నపిల్లలు. పూలో, పూజసామానో పట్డుకొని.  ఇదే బతక నేర్వడం.  ఏ యూనివర్సిటీ చెప్పని చదువు.

సాయంత్రం గంగా హారతి. గంగానది లో బోటులో వెడుతూ ఉంటె  నదీ తీరంలో దీపాలకాంతి. ఇటు నన్ను చూడమన్నట్టు పున్నమి చంద్రుడు.ఆనక గంగా హారతి. కొంత సేపు చూసి అప్పటికి ఉన్న రద్దీ ని గమనించి  బయటకు వచ్చేశాం. కాని కొంత తొక్కిసలాట తప్పలేదు. అదొక అనుభవం.

అదే రోజు రాత్రి కాశీ నుండి దేవఘర్ కి దురంతో ట్రైన్ బుక్ చేసుకొన్నాం. పన్నెండు గంటల ప్రయాణం. కాని మేం ఎక్కవలసిన ట్రైన్ ఏడు గంటలు ఆలస్యం. ఇలా ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుందిట. ఇదివరకు మా వాళ్లు ఇలాగే ట్రైన్ ఆఖరున కాన్సిల్ అయి వెళ్లలేకపోయారుట. ఇక...ఎలా...
మళ్ళీ ఓ మినీ బస్ ఒకటి మాట్లాడుకున్నాం దేవఘర్ వెళ్ళి రావడానికి. చేరిన రోజే తిరుగు ప్రయాణం కనుక ఇద్దరు డ్రైవర్లు.  శృంగేరి మఠం మానేజర్ వాళ్ల అబ్బాయి కి  ట్రావెల్ ఏజెన్సీ ఉంది.

#దేవఘర్

నవంబర్ 24

దేవఘర్ లో మా SBI holiday home ముందు గానే బుక్ అయింది.  కాశీ లో బయల్దేరటమే లేటు. చేరేసరికి ఎక్కువ సమయం పట్టింది.  ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది పదవది. ఇక్కడ శివుడు..వైద్యనాథుడు.  పర్లి లో కూడా  వైద్యనాథలింగం ఉంది. కాని దేవ్‌ఘర్ లోని దే ద్వాదశ జ్యోతిర్లింగాల లెక్కలో వస్తుంది అన్నారు.

రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని కోరి, తన తలలు నరుక్కోగా, పరమశివుడు రావణుని భక్తి కి మెచ్చి,చికిత్స చేసి తిరిగి దశకంఠుని శిరస్సులను తిరిగి పెట్టినట్లు స్థల పురాణం.(వికీపీడియా)
 మేమంతా పన్నెండు మంది బృందం. మాతో ఒక పండిట్ సంకల్పం చెప్పించాడు, లొపల ఆ నీళ్ళు అభిషేకం చేయించాడు.
తరువాత ఆ ఆవరణ లో అన్ని ఆలయాలు దర్శించి,వెనక్కి వచ్చాం.

 నవంబర్ 25

తెల్లగా తెల్లవారింది కాశీకి తిరిగి వచ్చేసరికి.  ప్రయాగ కూడా వెళ్దాం. అక్కడి శక్తి పీఠాన్ని చూడాలని‌. నాతో సహా కొందరు చూసినా...మళ్ళీ ఫ్రెషప్ అయి, ప్రయాగ ‌..ఈసారి రెండు కార్లు చేసుకొన్నాం. త్రివేణి సంగమం లో స్నానాలు,  మాధవేశ్వరి దేవి,వేణీ మాధవుడు ఇలా చూసుకుని. వెనక్కి కాశికి. కాశీ చేరుతూనే దైవదర్శనానికి వెళ్లాం. చాలా రాత్రి అయింది. కాని అదృష్టం, విశాలక్షి అమ్మవారు,విశ్వనాధుడు,అన్నపూర్ణ తల్లి.ఎంత ప్రశాంతంగా.. చూశామో. ఒకటికి రెండుసార్లు అన్నట్లు.

నవంబర్ 26 .

పొద్దున్నే ఎయిపోర్ట్ కి వెళ్లాలి. అయినా తెల్లవారుజామున మరోసారి వెళ్దాం హారతి దొరుకుతుందేమో అన్నారు. నేను వెళ్లలేక పోయాను. కార్తీక సోమవారం, హారతి దర్శనం దొరకలేదు కాని, దైవదర్శనం  బాగా అయింది అన్నారు. ఇంకా వారాహి అమ్మవారిని కూడా దర్శించుకొన్నారట అంతా. నేనూ వెళ్ళి ఉండాల్సింది అనిపించింది. మాలో ఓ నలుగురు అక్కడ తొమ్మిది రోజుల నిద్ర చేయడానికి ఆగిపోయారు.
అరు రోజులు రాత్రి ప్రయాణం, పగలు తిరుగుతూ ఉత్సాహంగా గడిపాం.

అగస్త్యుల వారికే కాశీ పట్టణం వదలి వెళ్లాలంటే ఎంతో బాధ కలిగిందిట. అక్కడి  సకల దేవతలనీ ప్రార్ధిస్తాడుట. కాని వదలక తప్పలేదు. కాశీ వదలి  దక్షిణ దేశం వెళ్లాక కూడా...అకడ గోదావరీ తీరాన వీచే  గాలి ని చూసి.. కాశీ పట్టణ కుశలం అడుగుతూండే వాడట.

 అలా మేమంతా ఫ్లైట్ ఎక్కేవరకు అక్కడి అనుభూతులు చిక్కపరచుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యాం.


ముక్తాయింపు

2018  సంవత్సరం తీర్థ యాత్రా స్పెషల్... !
గంగోత్రి మొదలు, అన్ని తీర్థాల లో స్నానం..
" అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా"..
అయిందా...!
అంతఃశుద్ధి..సంగతేమిటి.?
ఈ మధ్య వాట్సాప్ లో ...
ఏ ప్రవచనాల మధ్య పిట్టకదో...కాని వచ్చింది.
ఎన్ని తీర్థాలలో ముంచి తెచ్చినా పోని దోసకాయ చేదు.
మనిషి అలా కాదే. తీర్థం  ఉత్త నీరేనా...అందు లో స్నానం చేస్తే నే పాపం పోతుందా.. పాపం సంగతి కాదు..నిన్ను నీవు మరచి, ముక్కు మూసుకొని, మునక వేయడ మే కదా స్నానం.

కాశీ- దేవఘర్ ప్రయాణం తో నాకు..ద్వాదశ జ్యోతర్లింగాల దర్శనం పూర్తి అయింది.
అయితే ఏమిటి... ఏం పుణ్యం వడికట్టుకు వచ్చావ్ అంటే... 'ఏమీలేదు' అనే చెప్తాను. అసలు ఎవరు ఏ యాత్రలు చేసినా, తీర్థ యాత్ర మాత్రమే కానక్కరలేదు. ఏం తెస్తారో ఆమాత్రం నేనూ దక్కించుకొన్నా.

ముఖ్యంగా తీర్థ యాత్రలు  చేసేటప్పుడు ఎలాటి వారైనా సాత్విక జీవితం గడపడానికి సిద్దంగా ఉంటారు. ఆ  కొద్దికాలం  వారి ప్రశాంత జీవితం తమ మిగతా జీవితాన్ని సానుకూలపరుస్తుంది అనే భావనలో ఉంటారు. ( అదే కోరిన కోరికలు తీరడం)

చాలా మంది తమ యాత్రానుభవాలు రాసేటప్పుడు...  'చరైవేతి చరైవేతి' అని  ఓ మాట తమ ప్రయాణానికి అన్వయించి చెప్తూ ఉంటారు.  తిరిగే తేనెటీగకే మధువు దొరుకుతుంది ట. ఇది ఉపనిషత్తు ల లో ఐతరేయ బ్రాహ్మణ్యము లోనిదిట.

హరిశ్చంద్రుని కుమారుడు లోహితాస్యునికి ఇంద్రుడు చెప్పాడని చదివాను..వికిపీడియా చేసి, ఇంగ్లీషు నుంచి తర్జుమా చేసుకొంటే ఇలా.

*చరించినందువలన   మధువు దొరుకుతోంది(తేనెటీగలకు) చరించినందువలననే   అత్తి ఫలాలులాటి తీయని ఫలాలు లభిస్తున్నాయి(పక్షులకు)
సూర్యుడిని చూడు,  చరిస్తున్నందుకు  అలుపు లేకుండా ఎంత ఆనందం గా ఉంటాడో - నడవాలి, నడవాలి.

*సంచారకుని  కాళ్లు పుష్పించే చెట్ల కొమ్మల్లాంటివి. వాటి మధుర ఫలాలు అతని ఆత్మ పొందుతుంది. అతని దోషాలు అన్నీ హరించిపోతాయి,నడిచిన శ్రమతో‌.

*ఎక్కడికీ కదలక ఉండే వాడికి సంతోషం ఉండదు అంటారు. సమాజం లో నలుగురి మధ్య గడుపుతూ, కాలం వెళ్లదీసేవాడు ఎంత మంచివాడవనీ తప్పు దోవన పడతాడు. కనుక సంచరించు.

*కదలక చతికలపడి ఉన్నవాడికి..వాని అదృష్టం కూడా కూర్చుంటుంది.అతడు లేస్తే లేస్తుంది,పడుకుంటే పడుకుంటుంది, నడిస్తే నడుస్తుంది..కాబట్టి. నడకసాగించు..సంచరించు.

మరి వచ్చే కొత్త సంవత్సరం కూడా ఇంకా కొన్ని కొత్త ప్రాంతాలు చూడాలనే ఉత్సాహం అయితే ఉంది. ఆ పై సర్వేశ్వరుని దయ.

శుభం 🙏



చరణ్వై మధు విందతి
చరణ్స్వాదుముదుంబరం
సూర్యస్య పశ్య శ్రేమాణం, యోన
తంద్రయతే చరశ్చరైవేతి చరైవేతి

చరించినందువలన [ తేనెటీగలకు ] మధువు దొరుకుతోంది చరించినందువలననే [ పక్షులకు ] స్వాదువైన ( అత్తి/ అంజూర )ఫలాలు లభిస్తున్నాయి చరిస్తున్నందుకు సూర్యుడు గౌరవించబడుతున్నాడు - నడవాలి, నడవండి ''

అడవి నుండి అడవికి — సమీక్ష

అడవి నుండి అడవికి 

జయతి లోహితాక్షన్ అడవి నుండి అడవికి చదవడం. పూర్తయింది. కొన్ని అపుడపుడు చదివినా, అంతా  ఒక సంకలనంగా చదవడం..అందులో పుస్తక రూపంలో.. తిరిగి తిరిగి నచ్చిన పేజిల్లోకి వెళ్ళి చదూతూంటే నేనే అడవి చుట్డి వచ్చానా అనిపించింది

సాధారణంగా ఎవరైనా..ఆత్మకథ రాసినా సరే, అంతో ఇంతో కల్పన లేకుండా రాయలేరు ... పడికట్టు రాళ్లవంటి భావజాలం చొరబడకుండా ఉండదు..కాని, జయతి వివరణ, పసిపిల్లలు చూసినది చూసినట్లు చెప్పినట్లు  ఉంటుంది.

జయతి కి అడవి పరిచయం జరిగింది..ఛత్తీస్ ఘడ్ అడవుల్లో.. ఎంత ప్రేమలో పడిపోయిందో తను అడవి తో.
అక్కడి పురుగూ పుట్రా తోసహా... అక్కడి మనుషులతో సరేసరి.

వళ్లు గగుర్పొడిచె 'కాలానాగ్' చూసినపుడు... నదిలో పాము పిల్లలు ...తల్లి ని ఎట్లా ఫోటో తీయగలిగిందో..!

'జలగ చేత మత్తునిచ్చి నన్ను తనలో కలుపుకొంది అడవి'.ట ఇదేం మత్తు!

" పూర్ణ నవ్వింది. సాల ఆకుల మీద మంచు పూర్తి గా కరిగిపోయింది"

కట్టెలమోపు తో  అకడి స్త్రీలు ఒకరివెనక వారు లయబద్ధంగా  పరుగులాటి నడకతో వస్తూంటే,
'అది నడకలా లేదు. అడవిపాటకు అడుగులేస్తున్నట్టుగా' ఉందిట.

"వారు వస్తుంటే బాటనుండి పక్కకి తొలగి నిలబడాలనిపిస్తుంది"
కట్టెమోపుల కావిళ్ల కెత్తుకొని నడచి వస్తున్న 'లకడీవాలా' లయబద్దమైన నడక... అడవి మనుషుల శ్రమైక జీవనం... హారతులెత్తి నట్లు  ఇలా తన మాటల్లో దృశ్యమై నిలుస్తుంది.

తన మనసు ఉప్పొంగిన భావనలెన్నో ఇంతే  దృశ్య రూపం ఇస్తూ..
ఓ పెద్ద చెట్టు ను చూశాక... అడవి ఆత్మ దర్శనం కలిగినట్లైంది.ఎందరినో పిలిచి చూపించాలనిపించింది అంటూ ఆకాశంలో కి విస్తరించిన చెట్టు చూపిస్తారు.(కొండ అత్తి చెట్టు)

" ఎన్నెన్నో ఎత్తైన చెట్లున్నాయి. వేలవేల ఆకుపచ్చ వర్ణాలుగా ఉంది. చెట్లు కొన్ని ఆకులు రాల్చేసాయి.కొన్ని ఆకులు రాల్చడానికి సిద్దం చెసుకొంటున్బాయి. కొన్ని చెట్లు పుష్పిస్తున్బాయి. ఎండ కొన్ని ఆకు చిగుళ్లలో ఎర్రని ఎరుపై మెరుస్తుంటే,రాలబోతూ కొన్ని పండి ఎరుపెక్కి మెరుస్తున్నాయి....."
ఇలా సాగిన ఈ అడవి వర్ణన వాల్మీకి కావ్యం లా లేదూ!

సైకిళ్లమీద మైళ్ళ కి మైళ్ళు.. ప్రయాణం. ఘాట్ రూట్ లో సైతం.
అడవి దుంపలు తిని,అడవినీళ్లు తాగి,కొండగాలి పీల్చిన స్వేచ్ఛ.. అనుభూతి.
ఆరుబయట చేలలో ఆశ్రయం దొరికిన ఓ చోట..ఆరగింపు ఇలా ఉంది.. ఆకాశంలో 'చుక్కలు ఒక ముద్ద, మినపప్పు కూర తో కలిపిన అన్నం ఓ ముద్ద.' అటువంటి రాత్రి మళ్ళీ రాదనుకొంటూను.

తెలియకుండానే, ఆ సూఫీ సాధువు సమాధుల పక్కనే ఆదమరచి నిద్ర పోగల నిర్భీకత..ఆరాత్రి ఎవరు వచ్చి దుప్పటి కప్పారు?!

ఆవిడ తిరుమల అనుభవం..
మెట్ల దారిన తిరుమలకి వెడుతూ వస్తూ..గుంపులు గుంపులుగా... మనుషులు..
అన్నిదిక్కులనుండీ ఇంతమందిని ఒకచోటకు నడిపిస్తున్నది ఏది? ఈ అద్భుతం చూశాక ప్రత్యేకంగా శిలాతోరణం చూడ
లేదనిపించ లేదట.
.. 'నువ్వుకూడా చూడాలి అన్నారు... చూశావా అని తను అడగలేదు. నేను చూశాను'

మరో రామాయణ గాధ లాటి 'అమృత సంతానం' మీద ఆరాధనా పూర్వకమైన సమీక్ష..

"అయితే మీరు గుళ్లన్నీ చూస్తూ వస్తున్నారా?"

'అడవులు,అడవుల్లో మనుషులు,పల్లెలు,పంటలు, కాలువలు,నదులు, చెరువులు, కొండలు,గుళ్ళూ చూస్తూ వస్తున్నామన్నాను'.

గుండెలపైన చేతులేసుకొంది ఆమె కళ్లు మెరిశాయి.

'ఇన్ని చూసొచ్చిన మిమ్మల్ని చూస్తుంటే దేవుళ్లను చూసినట్టుందన్నది.'

వారిద్దరినీ చూసి అత్రి,అనసూయలను చూసినట్లు వుందని అన్నారు వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఎఫ్బిలో జయతి ని పరిచయం చేస్తూ. ఇవన్నీ చదివాక అలాగే అనిపించింది.

'మేమిద్దరం ఒకటి కాదు.మేమిద్దరం ఒక్కటే'
అంటూనే, ఈ చక్కని ప్రేమ కావ్యాన్ని తన జీవిత భాగస్వామి లోహితాక్షన్ కు అంకితం ఇచ్చారు.







అయోధ్య-

అయోధ్య

21/11/2018

మా లిస్ట్ లో తర్వాత అయోధ్య. రాముడి అయోధ్య.సాకేత రాముడి నగరం. అక్కడ చూడడానికి ఏముంది అన్నారు. ఏముందో..... అనే వెళ్లాం.
మన బాపూ గారు(మన చిత్రకారులు) అన్నట్టు, అక్కడ పాయసం తింటే పిల్లలు పుడతారని, అదీ శ్రీ రామచంద్రు లాంటి కొడుకేనని...ఆ చోద్యం జగత్విదతం కనక...ఆ నేల,ఆ గాలి, సరయూ నది చూద్దామని.

రామాయణం లో అయోధ్య వర్ణన‌

సరయూ నదీ తీరంలో కోసలదేశం ఉంది .ఆ కోసల దేశపు రాజధాని అయోధ్య. ఇక్ష్వాక వంశానికి చెందిన  ఎందరో రాజులు  రాజ్యమేలారు  ధశరధ మహారాజు  ఇప్పుడు రాజ్యమేలుతున్నాడు అతని కుల దీపకుడే శ్రీ రామచంద్రుడు
పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు ..అంటే ఇప్పటి లెక్కలో దాదాపు మూడు వందల చదరపు కిలో మీటర్ల వైశాల్యం.  అయోధ్యా నగరపు వీధులు దారిపక్కన పూల చెట్లు రాల్చిన పూల తో సహజంగా అందంగా ఉంది.  అద్భుతమైన రాజరికపు కట్టడాలు ఉన్న గృహాలు.
నగరం మధ్య పలురకాల అంగళ్లు.. అందులో రకరకాల ఆయుధాలు,యంత్రాలు అమ్మకానికి ఉన్నాయి.
ఎత్తైన కొట బురుజుల తో , ధ్వజములతోవందల కొలదీ శతఘ్నులు..ఆనగరపు రక్షణ వ్యవస్థ. పాడిపంటలు సమృద్ధిగా ఉన్న ఆనగరం లో అన్నార్తులెవరూ ఉండరు.ఆకలి తో అలమటించే వారు లేరు.

ప్రస్తుతం

అది ఇప్పుడు రాజకీయ అయోధ్య. ట్రాఫిక్ పోలీస్ మా బస్ లోపలకి వెళ్లదు అన్నాడు. అపుడు మా వాళ్ళు వెళ్ళి మేం స్టేట్ బాంక్ ఉద్యోగుస్తులం అని ఐడి ప్రూఫ్ లు చూపిస్తే, అపుడు అనుమతించారు. ఊరు మొదట్లో నే ఒక గైడ్ దొరికాడు.బస్ ఎక్కాడు. ఎక్కాడా, ' జై బోలో శ్రీరామ్ కీ' ...అన్నాడు దాదాపు అరచినట్టు గా....ఉలిక్కిపడ్డాం అంతా...!  వంత పలికాం భక్తిగా! బస్ ఊళ్లోకి వెళ్లాక...మరో ఐదు, పది నిముషాల్లో నే రకరకాలుగా మా చేత చెప్పించాడు.. భయ భక్తులు కలిపి.

సరయూ నది దగ్గకరకి తీసుకుని వెళ్లాడు....నీళ్లలో కి కాళ్ళు తడిసేలా దిగాం. అక్కడే దొప్పల్లో అమ్ముతున్న దీపాలు వెలిగించి నదిలో విడిచి పెట్టాం. గోపూజ,దక్షిణ.కొన్ని ఫోటోలు.

రామజన్మభూమి ఆలయనిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశం.
సరయూ నదికి వచ్చే దారిలో నే ...బస్ దిగకుండా నే చూశాం. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చేదాక..ఆలయ నిర్మాణానికి అవసరమైన శిల్పాలు, స్థంభాలు..అన్నీ దాదాపు 80%  పూర్తి అయినట్లు చెప్పారు.

అయోధ్యలో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం.  ఇక్కడ దాతలసహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తారుట.
 ఒక  ముసలాయన దగ్గర కు తీసుకు వెళ్ళాడు మాగైడ్. ఆయన ఆధ్వర్యంలో ఈ అన్నదాన,  కార్యక్రమం నిర్వహణ  జరుగుతుంది అన్నారు. వెయ్యి నూటపదాహార్లు ఆ పైన ఇస్తే,శిలాఫలకం పై పేర్లు వేయిస్తామని..నిర్భంధం ఏమీ లేదు మీకు తోచింది దానం చేయమంటే.. ఒకళ్లిద్దరు వెయ్యనూటపదహార్లు ఇచ్చారు కాని మిగతా అంతా  వంద! యాభై మాత్రమే ఇచ్చి బయటపడ్డాం.

కౌసల్యాదేవి మందిరం. సీతారాముల విగ్రహాలు... సీతమ్మ పుత్తడి తోనూ,శ్రీ రాముడు వెండితోనూ చేసిన విగ్రహాలు చూశాం.  హనుమద్ మందిరం. వాల్మికీ మందిరం.
హనుమదాలయం కొంచం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 80 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సితారాముల ఆలయం ఉంది.

అంతా హడావుడి పర్యటనలొనూ..  ఒకచోట మందిర ప్రాంగణంలో పురాణ ప్రవచనం.... రామాయణం చెపుతున్నారు ఒకాయన. ఆ గొంతు ఎంత స్వచ్ఛంగా...ప్రశాంతంగా ఉందంటే, బహుశా హనుమ, అక్కడే ఎక్కడో కూర్చుని పరవశించి వింటూండవచ్చు. నాకైతే సమయం లేకపోయింది.

రామజన్మ భూమి. బాబర్ మసీదు కట్టిన చోటే....
పూర్తి సెక్యూరిటీ ఉంది. సెల్ ఫోన్, కెమెరాలు, పెన్నుల లాంటివి కూడా లోపలకు అనుమతించరు. నేనో చిన్న బొమ్మ కొన్నా..కాని అక్కడే బయట వదిలేయాలసి వచ్చింది. లోపల నాలుగు చోట్ల చెకింగ్ జరిగింది. ఒక్కళ్లే పట్టే క్యూ ...చుట్టూ ఇనుప దడికి అవతల రక్షక భటులు.  ఒకరిని చూసి చాలా చిన్న పిల్లవాడు అని చూస్తే అమ్మాయి...!   అమ్మాయిలు కూడా సెక్యూరిటీ ఫోర్స్ లో గన్స్ పట్టుకుని ఉంటే ముచ్చటగా  అనిపించింది.
అలా అత్యంత రక్షణ చుట్టూ ఉండగా, క్యూ లో అలా  ముందుకి పోతూనే ఆలయాన్ని దర్శించాలి. ఎక్కడా ఆగకూడదు రక్షణ సిబ్బంది అనుమతించరు. ఇంత సెక్యూరిటీ మధ్య చూశాం.. సీతారాములను...!!

తమ భక్తులకు రామలక్ష్మణులు అంగరక్షకులు గా ఉంటారని, ఇప్పటికీ నమ్మినవారికి తోడై ఉంటారని అంటారు.
ఈయనకి భక్త రామదాసు ఉసురు తగిలిందేమో,..ఏమో... 'అబ్బా తిట్టితి నని ఆయాస పడవద్దు రామ చంద్రా'  అని సముదాయించినా .‌‌‌‌...! కాకపోతే, ఆ రఘవంశ తిలకునికి ఎమిటీ  చెర...!?

రామదండు మాత్రం ఆప్రాంతంలో మెండు. ఏ రక్షణ సిబ్బందీ ఏం చేయలేరు. ప్రసాదం చేతిలోది లాగేసు కొంటాయి. గమనించి ముందు గానే వాటికి పడేసాం.

వాటిని చూస్తూ మా ఫ్రండ్ అన్నది కదా...' వీటికి కూడా ఆడవాళ్ళు అంటే లోకువేట...మనం అదిలిస్తే కదలవ్' వెంటనే కొంచెం ఎడంగా ఉన్న పెద్ద కోతి..అర్ధమైనట్టు అరుస్తూ పళ్ళు చూపించింది దడచుకునేలా..! ఎవరో గట్టిగా కట్టెతో అదిలించారు.

బయటకు వచ్చి కొంత దూరం నడిచాక, మాకు అరవిందాశ్రమం కనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉందో.  కాసేపు అక్కడసేద దీరి...అక్కడ పుస్తకాల షాపులో కొన్ని సావనీర్స్ కొని బయటకు వచ్చాం.

అసలైనది చూశాం... ఇంకా లవకుశులు కట్టించినవీ..ఏవేవో ఉన్నాయి అన్నాడు. ముఖ్య మైన హనుమ ఆలయం చూసి బస్ ఎక్కేశాం. ఆ రాత్రి అయోధ్య నుంచి గయ కు ట్రైన్ లో వెళ్లాలి. ఈ లోగా మంచి హోటల్ చూసి డిన్నర్ చేసాం.  మా ట్రైన్ దాదాపు రెండు గంటలు లేటు. సామాను తో అయోధ్య స్టేషను లో మేమంతా దొరికిన చోట కూర్చుని కాసేపు కబుర్లూ...., కునికిపాట్లు..వంతులవారీగా అన్నట్టు.




నైమిశారణ్యం

నైమిశారణ్యం


లక్నో నగరానికి దాదాపు 100 కి.మీ దూరంలో లో ఉంది నైమిశారణ్యం. నవంబర్ నెల 20  తేదీ న కొంతమంది మితృలతో కలిసి ఈ ప్రాంతం సందర్శించాను. హైదరాబాదు నుంచి ఫ్లైట్ లో లక్నో చేరి, అక్కడ ముందుగా మాట్లాడు కొన్న మినీ బస్  లో నైమిశారణ్యం వచ్చాం. నైమిశారణ్యం గురించి చాలా మంది ద్వారా వినడమే కాదు..భాగవతం లోనూ నైమిశారణ్యం ప్రశంస చదివాను

అరణ్యాలలోనే ' నైమిశ' మనే అరణ్యం గొప్పదీ పవిత్రమైనది అంటారు. 

మాధవీలత అల్లుకున్న గున్న మామిడి చెట్లు, వెలగ, అరటి, పనస,అర్జున(మద్ది),అశోక, చందన,కర్పూర,తిలక, దేవదారు వృక్షాలతోనూ,
ఎరుపు-తెలుపూ చండ్ర చెట్లతో... ముళ్లచెట్లూ, మృదువైన లతలూ, సపర్ణాలూ..అంటే చక్కని ఆకులూ కలిగి ఉందీ అడవి.

పున్నాగ,సంపంగి  తెల్ల తామర పూలు ... రకరకాల పూలవృక్షాల తో నిండి, చెలరేగిన పూల పరాగం తో, తేనెల తో నిండి ఉందిట

కను విందు చేసే పక్షులు నెమళ్లు, నీటి పక్షులు కొంగలు, హంసలు,  నీటికాకి, ఇంకా గుడ్లగూబలు, చిలుకలు, భరద్వాజ,తిత్తిరి(తీతువు) పక్షులతో కలకలమంటూ.....

ఏనుగులు, పెద్దపులులు, తోడేళ్ళు, అడవిదున్నలు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, లేళ్ళు, చమరీమృగాలు, సింహాలు, వరాహాలు, ఖడ్గమృగాలు, దుప్పులు, కోతులు, శరభాలు మొదలైన అడవి మృగాలు సంచరిస్తూ ఉండేదిట  ఈ అరణ్యం...

మునీశ్వరుల నివాసం అయిన ఈచోటు..అంతటి తాదాత్మ్యం సంతరించుకొందా అన్నట్లు...

వేదవ్యాసుల వారు తన కుమారుడైన  శుకుడు అన్నీ వదలి సన్యాసియై వెడుతుంటే   ' కుమారా' అని  వెనకనించి పిలిచారట. ఆ పిలుపుకు  అడవిలో ప్రతి చెట్టూ, కొమ్మా, రెమ్మా,పక్ష్యాదులు సహితం పలవరించినట్లు తన్మయత్వంతో అరణ్యం అంతా...ప్రతిధ్వనించింది ట...!

వేద వ్యాసులవారు శ్రీమద్ మహాభాగవతం రచించిగా, ఆ మధుర ఫలాన్ని శుకబ్రహ్మ రుచి చూసి రసజ్ణులకు అందించారట
రోమహర్షుని కుమారుడు, పురాణాలన్నీ వ్యాఖ్యానం చేసే పద్ధతి తెలిసినవాడు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు, శౌనకాది మునులందరికీ భాగవత కథ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూత మహాముని శౌనికాదులకు వివరించాడుట.

శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ . లవకుశులను కలుసుకున్నది ఇక్కడే.

శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు.
ఆదిశంకరులు ఇక్కడి లలి తాదేవిని దర్శించి 'లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.

ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇలా ఒళ్ళంతా కళ్లు చేసుకొని ఎదురు చూస్తూ వచ్చేసరికి... చక్రతీర్థం దగ్గర బస్ ఆపాడు.

చక్రతీర్థం... చక్రం కమ్మీ విరిగి పడిన చోటు.. మునులు తపస్సు కు అనువైనదిగా బ్రహ్మ దేవుడు..చూపిన చోటు.ఈ చక్రతీర్థం చుట్టూ  గుడులు ఉన్నాయి.

చాలామంది ఈ తీర్థంలో స్నానాలు చేస్తున్నారు. మేము కాసిని నీళ్ళు నెత్తిన చల్లుకొని..అక్కడ అనువైన చోట ఉసిరి కాయ దీపాలు వెలిగించాం. తీర్థం చుట్టూ ఉన్న మహదేవుని ఆలయం..భూతేశ్వర ఆలయం తో సహా ఉన్న అన్ని ఆలయాలు చూసి..అక్కడ నుండి బయలుదేరాం.

ఆ రోజునే మేం వెనక్కి వెళ్లాలి. మా బస్ డ్రైవరే మాకు గైడ్ అక్కడ. వ్యాస గద్ది,శుకబ్రహ్మ...సూతగద్ది,లలితామ్మవారి గుడి,హనుమంతుని గుడి,ఇలా మా గైడ్  కమ్ డ్రైవర్ చూపించినవి చూశాం..చూస్తున్నాం..సత్యనారాయణ స్వామి గుడి కడతున్నామన్న చోటు తో సహా. ధధీచి కుండం దూరం ,టైమ్ లేదనీ తీసుకెళ్ల లేదు. ఓ రెండు రోజులు ఉంటే లోపల కి ఇంకా చూసే అవకాశం ఉందన్నారు.

కానీ...

ఏవీ.. అడవి ఆనవాళ్ళు ఎక్కడా?
నిరుత్సాహం కలిగింది. ఇంకా... ఇంకా,అక్కడ వసతి గృహాలు అవీ కడుతున్నారు.ఎంత జనప్రవాహమో....అలా అడవి అంతా మనుషులు వచ్చేశారు... వచ్చేశాం. కొంచెం దిగులుగానే అనిపించింది.







శ్రీ శైల యాత్ర-3

అహోబిలం

అది మూడవ రోజు తిరుగు ప్రయాణం రోజు.ఎంత త్వరగా అనుకొన్నా, అహోబిలం చేరేసరికి దాదాపు పన్నెండు అవుతోంది. గుడి మూసివేసే సమయం. గబగబా ఏవో పూజా సామగ్రి తీసుకొని లోపలికి వెళ్లాం‌! 

 భక్తవరదుడు, ఆపన్న ప్రసన్నుడు, విశేషించి ప్రహ్లాదవరదుడు రమ్మంటూ ఆహ్వానం పలికాడా లక్ష్మినారసింహుడు. ప్రాంజలితో అంతరాలయం ప్రవేశించాం. ఇది దిగువనున్న ఆలయం అనీ, ఇంకా కొండపైన అహోబిలంలో నరసింహస్వామి ని కూడా చూడాలి అన్నారు. ఇక్కడి అమ్మవారు 'అమృతవల్లి' . అపరాహ్ణమైనా, దైవసన్నధి కదా, ధ్వజస్తంభం దగ్గర తెచ్చిన దీపాలు వెలిగించారు.
బస్ లో ఎగువన ఉన్న నరసింహస్వామి ఆలయానికి వెళ్లాం. ఆలస్యం అయింది కదా. గుడి మూసేశారు.
పక్కనే అన్నసత్రం.
పరబ్రహ్మ స్వరూపం...
'ఆరంగించి కూర్చున్నాడు అల్లవాడే...'
మరి మనకో..అంటూ వెళ్తే,  రండి రండి అంటూ విస్తర్లు వేసి..ముందూ..వెనుకగా అందరికీ భోజనం పెట్టారు.
'అన్నదాతా సుఖీభవ..!' అంటూ  సత్ర నిర్వాహకుల వితరణ ని ప్రశంసించి...వెయ్యనూట పదహార్లు డొనేట్ చేసి బయటకు వచ్చాను. నేనూ మా చెల్లెలు నెమ్మదిగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టాం. రెయిలింగ్ ఉంది కనక ఎనభై మెట్లదాకా ఉన్నా ఎక్కగలిగాం.  రెండవ పంక్తి లో భోజనాలు చేసినవారు అంతా కొద్ది సేపట్లోనే వచ్చారు.

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం

ప్రహ్లాదుని రక్షించడం కోసం స్థంభం నుంచి వెలువడి నారసింహుని అవతారం విశేషం ఈ కొండపైనే జరిగిందని పురాణ కధ.

కొండమీద బిలం లో వెలిసిన నరసింహుని  ఇక్కడ స్వామి స్వయంభువుగా చెప్పారు మాకు పూజారి గారు. అపరాహ్ణవేళ పూజలు ఉండవు కాబట్టి తీర్థ, ప్రసాదాలు లభించాయి. చెంచులక్ష్మి అమ్మవారు ఇక్కడ.

ఇక్కడి గుహలోనే కాకుండా ఇంకా పైన కూడా చూడవలసిన వి ఉన్నాయన్నారు కాని, అంత శక్తి సమయం రెండూ లేవు. కాని మా దత్తాత్రేయశర్మ గారు వదలి పెట్టలేదు కనీసం ఇక్కడ ఉన్న గుండం చూడండి అని ఓ రెండు కి.మీ. ముందు కి తీసుకుని వెళ్లారు. 'భవనాశిని' ట అది నరసింహ స్వామి పాదాలు కడిగిన నీరు..అంటూ . కాసేపు ఆ మడుగు చుట్టూ చేరి కాళ్ళు నీళ్లలో ఉంచితే...చూడాలి..పాదాల చుట్టూ చేపపిల్లలు చేరాయి. పైనుంచి ఎక్కడినుంచో నీటి ధార అక్కడ మడుగు అయింది. ఇంకా పైకి ఊడలు దిగిన చెట్లు.. ఇంకా పైదాకా వెళ్లి అన్నీ చూసే అవకాశం లేదు.

**అలంపురం జోగులాంబ-బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయం.
శ్రీ శైలానికి పడమటి ద్వారం ఆలంపురం.
మాది తిరుగుప్రయాణం

*లంబస్తనీం, వికృతాక్షీం,ఘోరరూపాం, మహాబలాం!
ప్రేతాసన సమారూఢాం, జోగుళాంబాం నమామ్యహం*

అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవది జోగులాంబ శక్తి పీఠం. ఇక్కడ సతీదేవి పై దంతం పడినట్లు పురాణం. మేము అహోబిలం లో బయలు దేరి అలంపూర్ కి వచ్చేసరికి చీకటి పడింది. ఇక గుడి మూసేస్తారు అన్నపుడు అంతా బస్ దిగి పరుగులాటి నడకతో వెళ్ళి అమ్మవారిని దర్శించుకొన్నాము. పైన చెప్పిన శ్లోకం అక్కడ రాసి ఉంది.

తీర్థ ప్రసాదాలు తీసుకొని. బాలబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి వెళ్లాం. అక్కడా అదే పరిస్థితి. గుడి మూసేస్తున్నారు. కాని చిత్రం గా స్థల పురాణం చెప్పమని శర్మ గారు అడగ్గానే, (పూజారి, పేరు కృష్ణమూర్తి అని చెప్పినట్లు గుర్తు).  పురాణకథ యావత్తూ ఎంతో శ్రద్ధగా వివరించారు.
ఈ బాలబ్రహ్మేంద్రుని  మూర్తి కూడా మహానంది లో లా గోష్పాద ముద్ర తో మణిగి నట్టు ఉన్న శివలింగమే. అయితే అతనో విషయం చెప్పాడు. ఆ ప్రాంతం అంతా పాదరసం నిక్షిప్తమై  ఉన్నదని, ఏ పిడుగుపడటం వల్లనో ఈ లింగం లో అటువంటి మార్పు వచ్చింది అనీ చెప్పారు. ఇక్కడ శివలింగం శిల కాదు,చెక్క కూడాకాదు. ఏ పదార్థం అన్నదీ తెలియదు ట.  శతాబ్దాల కిందట అక్కడ పరసవేదికి సంబంధించిన ప్రయోగాలు చేసారట కొందరు సిద్ధులు. లోపల సిద్ధుల విగ్రహాలు ఉన్నాయి.

మేము చూసిన బాలబ్రహ్మేశ్వరుడు కాక, ఇంకా ఎనిమిది బ్రహ్మ ఆలయాలు ఉన్నాయట. మొత్తం కలిపి నవబ్రహ్మ లు ఉన్నారు. పూజారి గారు చెప్పిన దాని ప్రకారం ఆ ఊర్లో ఇంకా అనేక దేవాలాయాలు సూర్య దేవాలయం తో సహా ఉన్నాయి. అంతా విన్నాక, ఇక్కడికి  ప్రత్యేకంగా వస్తేనే అన్నీ చూడగలం అనిపించింది.
తుంగభద్ర, కృష్ణా నదుల సంగమం ఉండటం వల్ల ఈ ప్రాంతం దక్షిణ కాశి అని కూడా పిలవబడుతుంది...( అసలు దక్షిణ కాశీ అంటే శ్రీ కాళ హస్తి)

ఇది ఇలా ఉంటే,  చరిత్ర ఏం చెప్తుందో చూద్దాం.  ఈ ఆలయం ఏడవ శతాబ్దం లో బాదామి చాళుక్యుల కాలంలో నిర్మితమైంది ట. వీరు కర్ణాటక ప్రాంతం లోని బాదామి ని నుంచి వచ్చిన వారు. దక్కన్ పీఠభూమి లో ఉత్తర ప్రాంతం అంతా వీరి అధీనం లో నే ఉండేదిట. దాదాపు రెండువందల ఏళ్ల పాటు పాలించిన ఈ రాజులు..గొప్ప శిల్పకళా పోషకులు. ప్రస్తుతం అలంపూర్ లో ఉన్న ఎర్ర ఇసుక రాయి శిల్పాలన్నీ ఆ కాలం వే అని పురావస్తు శాఖ వారి నిర్ధారణ.

తర్వాత పదిహేనవ శతాబ్దం లో బహమనీ సుల్తానులు దండెత్తి నపుడు..జోగులాంబ మందిరం లో ని మూలవిరాట్టు, మిగతా విగ్రహాలను బాలబ్రహ్మేశ్వర ఆలయం లో దాచి ఉంచారట.  నాగార్జునసాగర్  డామ్ కడుతునపుడు కూడా  ఈ ఆలయం ముంపు కి గురి అవుతుంటే...స్ట్రక్చర్ ని కాపాడి, కొంచెం దూరంగా జరిపారట. అలా అనేక సార్లు ఈ ఆలయం  పునరుద్ధరణ జరిగింది.
ఇంత ఓర్పుగా అతడు  చెప్పిన ది విని ధన్యవాదాలు చెపుతుంటే, మీలా ఆసక్తి కనపరచే వారు అరుదు అని తిరిగి మమ్మల్నే మెచ్చుకొన్నాడు ఆయన. తరవాత బయటకు వచ్చి ధ్వజ స్థంభం దగ్గర దీపం వెలిగించి. గుడి లో ఇచ్చిన గుగ్గిళ్ల ప్రసాదం తలా ఇంతా తిని ఆ ప్రాంగణంలో అరుగుల మీద కూర్చున్నాం.  ఉగ్గాణి బయట ఆర్డర్ ఇచ్చివచ్చారు. అదే ఫలహారం ఆ రాత్రి కి.

ఫలహారం వచ్చేలోగా అనేకమైన రస సంభాషణలో, చతురులతో గడిపాం. స్వతహాగా సంగీత అభిమాని అయిన నా ఫ్రండ్ శ్యామల  చక్కని పాటలు ...నెమ్మదిగా పాడటం మొదలు పెట్టారు. పక్కనే కూర్చుని విప్పారిన ఆవిడ స్వరం తో పాటు ఆవిడ తో పాటు వింటున్న మా మనసులూను.   కొందరు దూరంగా ఉండటం వల్ల వినలేకపోయారు.  వాళ్ళు కూడా అదే అలౌకిక ఆనందానుభూతి లో ఉన్నారని తెలుసు.
 ఎందుకంటే, అది శారదరాత్రి, అష్టమి చంద్రుడు పైన.....
'అమ్మవారిని అష్టమీచంద్ర విభ్రాజ'   అమ్మ దరహాసం తో కరుణా వీక్షణాలు మా పై అలా ప్రసరింప చేసినందుకు కావచ్చు.

ఆలోచిస్తే మా ఆధ్యాత్మిక పర్యటన లో ఓ సంపూర్ణత్వం గోచరించింది. అమ్మవారి ని బాలా త్రిపురసుందరీ గా, ఉమాదేవిగా, భ్రమరాంబ గా, కామేశ్వరి దేవిగా చూస్తూ వచ్చి..ఇక్కడ ఒక యోగినిగా జోగులాంబ ను చూడటం...జ్ఞాన దృష్టి లో, ఒక ఆవృతం పూర్తి అయినట్లు...జన్మ తరించింది.

శ్రీ మాత్రే నమః 🙏

శ్రీ శైల యాత్ర-2

రెండవ రోజు దర్శనాలు

మల్లికార్జునుడు

జ్యోతిర్లింగాలలో 'స్పర్శ దర్శనం'  ఓ ప్రత్యేకత.  మర్నాడు   తెల్లవారు ఝామున అంతా లేచి తయారై గుడికి వెళ్లాం.
 మేం వెళ్లేటప్పటికే,  ఓ పాతిక మందికే ఆ స్పెషల్ దర్శనం పరిమితం చేసి, మాకు లేవన్నారు. చేసేదేముంది. మాములు దర్శనమే.

మల్లికార్జునుడు గుడిలో వీరశైవ మంటపం...ఒక inscription చదివాను. పదమూడవ శతాబ్దం లో అనవేమారెడ్డి అనే రాజు ఈ వీరశైవ మంటపం కట్టించాడని. వీర శైవ భక్తులు చేతులు, నాలుక..ఇతర అవయవాలు నరుక్కుని భక్తిని చాటడాన్ని ' వీరాచారం' అంటారనీ రాసి ఉంది. అమ్మో అనిపించింది.

*భ్రమరాంబాదేవి:*

అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది ఈ శక్తి పీఠం.   సతీదేవి కంఠ భాగం ఇక్కడ పడినట్లు పురాణ కథనం. శ్రీశైల పీఠాన్ని అధిష్టించిన భ్రామరీ శక్తి భక్తుల కోరికలను తీరుస్తుంది.

సేకరించిన స్థల పురాణం—( వికీపీడియా)

 ఒకప్పుడు అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మను నుండి రెండు, నాలుగు కాళ్ళా ప్రాణులనుండి తనకు మరణం లేకుండా వరం పొందాడు, అతని సంహారం కోసమై ఆదిశక్తి,  వేలాది తుమ్మెదల ను సృష్టించి, వాటిచే కుట్టించి, అతనిని సంహరించి లోకాలను కాపాడింది. తుమ్మెదలన్నీ ఆరుకాళ్ళ జీవులు కదా! దేవతల కోరికపై ఆదిశక్తి భ్రమరాంబికగా అక్కడ వెలసింది. ఇప్పటికి అమ్మవారి వెనుక గోడల నుండి భ్రమర ఝంకారం వినిపిస్తుంది.

అది వినడానికి వెనక వేపు  చెవిపెట్టి వినడానికి ప్రయత్నం చేశా కాని,  అంత సందడిలో నాకు మాత్రం ఏదీ వినబడలేదు.

*పాతాళ గంగ*

పాతాళ గంగను చేరడానికి ఇపుడు రోప్ వే ఉంది. అందుకని అంతా బయలుదేరి వెళ్లాం. పైనుంచి చుట్టూ చూస్తుంటే పూర్వపు పచ్చదనం కాస్త తగ్గింది అనిపించింది.

దత్తావతార పరంపరలో, శ్రీపాద శ్రీవల్లభుని తర్వాత అవతరించిన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తారు. తంతకుడు వారి శిష్యుడు, సేవకుడు. ఓ సారి శివరాత్రి నాడు,అంతా శ్రీ శైల యాత్ర వెళుతుంటే, తనవద్దే ఉండి పోయిన తంతకున పిలిచి, కళ్లుమూసుకొని తన పాదుకలు పట్టుకోమన్నాడు. అంతే కళ్లు తెరవగానే శ్రీశైలం లో ఉంటారిద్దరూ.  అట్లా తన భక్తునికి శ్రీశైల క్షేత్ర దర్శనం చేయించారు శ్రీ నృసింహ సరస్వతి.  చివరకు తన అవతార సమాప్తి కూడా పాతాళ గంగలో కావిస్తారు. ఇప్పటికీ స్వామి అచటి  కదళీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తభక్తుల విశ్వాసం.

నదీస్నానం

ఇలా పుణ్య మాసాలలో చేసే స్నానాల ప్రత్యేకతే వేరు. జ్ఞాన గంగ లో మునక వేసిన ఏ కొద్దిమందో తప్ప, మిగతావారికి ఇటువంటి మునక అవసరమే అంటారు పెద్దలు.
కృష్ణమ్మ  లో స్నానం.  ఆహ్లాదంగా ఉంది.  మనసు, ఒళ్ళూ, పరితప్తమైనట్లు... ఆ స్నానం తో అందరి ముఖాలు దీప్తి వంతమయ్యాయి. ఆ తర్వాత అందరం నదిలో దీపాలు విడవడం, పండగలా జరిగింది అంతా.

త్రిపురాంతకం.

*చిదగ్నికుండ సంభూతా* బాలాత్రిపురసుందరి.

శ్రీ శైలానికి తూర్పున ఉన్న మరో ప్రధాన ద్వారం త్రిపురాంతకం. ఇక్కడ బాలాత్రిపురసుందరి అమ్మవారు కొలువై ఉంది. మా బస్ అక్కడికి చేరే సరికి సాయంత్రం అయింది.  పైకి వెళ్లగానే, ఎండోమెంట్స్ డిపార్టుమెంటు వారి బోర్డు చూశాం. అందులో స్థలపురాణం రాసి ఉంది. ఈ ఆలయం రాక్షస నిర్మాణం అనీ, అందుచేత నైరుతి ద్వార ప్రవేశం అనీ రాశారు.

ఇక్కడి అమ్మవారు 'చిదగ్నికుండ సంభూత'. త్రిపురాసుడు అనే రాక్షసుని సంహరించడాని ఉద్భవించినట్లు స్థల పురాణం.
అక్కడి ఆలయ పూజారి  ఓ చక్కని విషయం చెప్పాడు.  అమ్మవారు, రాత్రులు సంహారానికి దిగుతుంది ...అనే కధలు అతడు తోసిపుచ్చాడు.  పూర్వపు రోజుల్లో కొంతమంది తాంత్రిక శక్తి ని అభ్యసించి..అక్కడ కొండమీద సాధన చేసేవారని, ఎవరూ అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి అలాటి కథలు ప్రచారం లోకి వచ్చాయని చెప్పాడు. ఇపుడా ఆలయం ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో నడుస్తోంది. పూజలు సక్రమంగా జరుగుతున్నాయి. విశేషించి అక్కడి తీర్థం లో తేనె, మిరియాలు కలుపుతారు.. రాక్షస ప్రవృత్తి కి విరుగుడు అంటూ చెప్పారు. అక్కడ కాసేపు కూర్చుని మేమంతా లలితా సహస్రనామం చదువుకొన్నాం. అలాగే కింద  త్రిపురాంతక స్వామి  వారిని దర్శించాం‌. అప్పటికే సాయంత్రం ఆరున్నర దాటింది. ఇంకా మహానంది వెళ్లాలి.

మహానంది

మహానంది చేరుకొనేసరికి రాత్రి పదకొండు. మేం ముందుగా అనుకొన్న ప్రణాళిక కాస్త మారింది. అందువల్ల మరో మితృలు రఘువీర్ గారు ముందుగా అక్కడికి ఫోన్ చేసి వసతి, భోజనము అదీ అందరికీ ఏర్పాటు చేశారు.

ఉదయమే ఆలయ సందర్శనం. ఇక్కడ స్వామి మహా నందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి.

మహా నందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిదని చరిత్ర.  ఇక్కడి శివలింగము గోష్పాద ముద్రతో ఉన్నది.  పుట్టలో ఉన్న స్వామివారికి,  ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా, పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కడం వల్ల ఆవు కాలిగిట్ట గుర్తు లింగముపై పడిఉంది.  (ఇట్లాగే మళ్ళీ ఆలంపూర్ స్వామి నీ చూశాం). గర్భాలయం లోకి ప్రవేశించి అంతా..'స్పృశించి ' దర్శనం చేసుకొన్నాం.

మహానంది ప్రత్యేకత అక్కడ పుష్కరిణి. స్వచ్ఛంగా, స్ఫటికంలా, అడగు భాగంలో రాళ్ళు కూడా స్పష్టంగా కనిపించేంత పారదర్శకంగా ఉంటాయి నీళ్ళు. పుష్కరిణి లో స్నానాలు చేశారంతా.

తిరుగు ప్రయాణం లో మహానంది నుంచి  అహోబిలం, అలంపురం...

శ్రీశైల యాత్ర-1

కార్తీక మాసం,పెరిగే చలితో పాటు భక్తి అన్నింతలు పెరుగుతుంది.  గుళ్ళు, గోపురాలు భక్తుల సందడి తో, లోపల దేవీ, దేవతలకు కూడా చోటు లేదేమో అన్నంతగా నిండిపోయి ఉంటాయి. ఈ మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసమట. ఈ నెలలో శివ వైష్ణవ క్షేత్రాల సందర్శన జరిగింది.

2018 సంవత్సరం నవంబర్ర్  13 నుండి 15 దాకా మూడు రోజులపాటు కొంతమంది మితృలం అంతా కలసి హైదరాబాదు నుండి స్పెషల్ బస్ లో ఉమా మహేశ్వరం, శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం, ఆలంపురం‌  ఇవన్నీ దర్శించుకొని వచ్చాం.

పర్వత సానువులు, ఈ కొండల చీలికలు, ఏర్పడిన గుహలు, సన్నని జలధారలు.. ఇంకా పైన తీగలు అల్లుకొన్న పెద్దపెద్ద వృక్షాలు...ఇలా నల్లమల అడవులలో ఉన్న ఈ క్షేత్రాలన్నీ సరిగ్గా గమనిస్తే ఒక అద్భుతమైన దృశ్య మాలిక అనచ్చు.

మా ప్రయాణం నల్లమల అడవులలో ఉత్తర ద్వార  ప్రవేశం తో మొదలై, శ్రీగిరి క్షేత్రం చుట్టి, కిందకు వస్తూ తూర్పు ద్వారం దాటి, మహానంది,అహోబిలం వైపుసాగింది. ఈ రూట్ మేప్ రూపొందించిన మితృడు శర్మ ని అభినందించాలి.

నైసర్గికంగా, ఈ నల్లమల అడవులలో సానువులు ఆది శేషుడు శయనించి నట్లు  విస్తరించి ఉన్నాయట. అందులో తిరుమల, అహోబిలం, శ్రీ శైల క్షేత్రాలు.. వరుసగా శిరస్సు నుంచి తోక వరకు స్వయం సిద్ధంగా ఏర్పడ్డాయట. చదువుతుంటే ఒళ్లు పులకిస్తోంది కదూ! గిరులూ తరులూ, ఝరులూ..అన్నీ చుట్టిన ఈ తీర్థ యాత్ర ఎంత పవిత్రమైనది.

మొదట హైదరాబాదు శివార్లలో ఉన్న  గ్రామదేవత మైసమ్మ గుడి ముందు ఆపారు మా బస్. అంతా లోపలికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి, కుంకుమ తీసుకుని బస్సెక్కాం.

రెండవది  ఉమామహేశ్వరం, శ్రీశైల క్షేత్రానికి ఉత్తరాన ఉన్న ద్వారం.   హైదరాబాద్ నుంచి దాదాపు నూరు కి.మీ. దూరంలో, శ్రీ శైలం వెళ్లే దారి లో ఉన్నది.   అంతా అటవీ ప్రాంతం. ఇక్కడ ఉమాదేవి శివుని కోసం తపస్సు చేసిందిట. అంతే కాదు పూర్వం మునులూ తపస్సు చేసుకోనేవారట. ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దం లో కాకతీయుల కాలంలో నిర్మించారు.

 ఈ ఉమామహేశ్వర ఆలయం కొండమీద ఉంటుంది. కాని వాహనాలు పైదాక వెళ్తాయి.  శ్రీశైలం వెళ్లే ముందు ఈ క్షేత్ర దర్శనం తప్పనిసరి అంటారు.  కాని ఇన్నేళ్ల లోనూ,  శ్రీశైలం మాత్రమే చాలా సార్లు చూసిరావడం అయింది. అక్కడ బయట అమ్మవారికి కుంకుమ పూజ చేయించాము అందరం.  తర్వాత లోపల శ్రీ చక్రం లొ ఉన్న అమ్మవారి ని దర్శించాం. బయటికి వచ్చాక, పైనుంచి చూస్తే చుట్టూ చాలా బాగుంది.

ఉమా మహేశ్వరుల గురించి మాట్లాడుతూ మా మితృడు, ఆధ్యాత్మిక పరిణితి ఉన్న ఛాయా మనోహర్ అంటారు కదా, అమ్మవారు 'మహామాయా' మాయా రూపమని, అది దాటి పరమేశ్వరుని చేరటం ధ్యేయమని...చమత్కారం ఏమిటంటే, మళ్ళీ ఆ అమ్మే మనకి దారి చూపుతుంది అని.

మా తర్వాతి మజిలీ ఒకప్పటి 'శ్రీగిరి' నేటి శ్రీశైలం. జ్యోతిర్లింగాల వరుసలో  ఇది రెండవది. ఇక్కడ భ్రమరాంబికా అమ్మవారు పధ్ధెనిమిది శక్తి పీఠాలలో వరుస క్రమం లో  ఆరవది.  మేము అక్కడి కి చేరేసరికి  మధ్యాహ్నపు భోజనాల వేళ దాటి పోయింది. అంతా ముందుగా బుక్ చేసుకొన్న కంచి కామకోటి వసతి గృహం చేరుకొని, సామాన్లు పెట్టి, కాస్త ఫ్రెష్ అయ్యాం.

ప్రదూషవేళ...కొందరు అభిషేకాలకు సిద్ధమయ్యారు. కొంత మందిమి సాధారణ దర్శనానికి సీనియర్ సిటిజన్స్ క్యూ లో వెళ్లాం. మల్లికార్జునుణ్ణీ, భ్రమరాంబ నూ దర్శించుకొని బయట కొచ్చాం.

కార్తీక మాసం,శుక్ల పక్షం...పల్చటి వెల్తురు..దీపాల కాంతి తో పోటీ పడుతూంది. నడుస్తూ చుట్టూ శిల్ప సౌందర్యం గమనిస్తూ వస్తుంటే, ఇవతల ఆలయ ప్రాంగణంలో... ఎవరిదో కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతోంది.  కాసేపు కూర్చుని లేచి వచ్చేశాం.

ఇక్కడ ఓ చిన్న ముచ్చట...

శంకర భగవత్పాదులు శ్రీశైల మహా క్షేత్రానికి వెళ్ళినపుడు, సంధ్యాకాలమైందిట. అపుడు అక్కడ మల్లె తీగ అల్లుకున్న మద్దిచెట్టును చూశారట.  మరి ఈ చరాచర జగత్తంతా తానే అయిన  ఆ పరమేశ్వరుడు... ఎలా కనిపించాడంటే...ఆ ప్రదోష వేళలో,

"భ్రమారంబిక  చేత ఆలింగినం చేయబడ్డ మల్లికార్జునేశ్వరుడు లా కనిపించాడట."

అక్కడే శంకరులవారు శివానందలహరిని రచించారుట..

వారిలా వర్ణించారు..

*సన్ధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థానాన్తరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితమ్ ।
భోగీన్ద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలిఙ్గం శివాలిఙ్గితం*
                                  _శివానంద లహరి(50)_

సంధ్యాసమయములలో విశేషముగా వ్యక్తమగువాడు, ఉపనిషత్తులయందు నెలవైయున్న వాడు (వేదాంతమందు చెప్పబడ్డవాడు), వాసుకి ఆభరణముగా కలవాడు, దేవతలచే పూజింపబడేవాడు, సద్భావనలచే శోభిల్లువాడూ, సద్గుణములచే తెలుసుకొనబడేవాడు, ప్రేమతో‌ భ్రమరాంబా దేవి చేత కౌగిలించుకోబడినవాడూ అగు శ్ర్రీశైలేశుడు, మల్లికార్జునస్వామిని నేను సేవించుచున్నాను.

శంకరులు అంతర్లీనంగా మరో అర్థమును కూడా చెప్పారు. శివశక్తుల సంయోగమంటే, మన మేధ ఈశ్వరుని శుద్ధతత్త్వంలో ఐక్యం కావటమే నట.