Thursday, 18 December 2025

కోనసీమ ప్రయాణం 4

 

ద్వారకా తిరుమల


బెజవాడ కనకదుర్గమ్మ


కోనసీమ ప్రయాణం-4

లయ దర్శనాలు


రాజమండ్రి లో ఉదయమే ప్రయాణం అయి, వాడపల్లి, ర్యాలికి చూడ్డానికి వెళ్లాం. రెండూ తెలుసు కాని, చూడని ప్రదేశాలే.

వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని, ర్యాలీ కి బయల్దేరాం.


ర్యాలి లో ఉన్నది చెన్నకేశవుని ఆలయం  చాలా పేరున్న ఆలయం. ర్యాలికి ట్రాన్సఫర్స్ కోసం వస్తుంటారని తెలుసు.  ఇక్కడి ఆలయం కూడా పురాతనమైనదే.. పదకొండవ శతాబ్దానికి చెందినదేనట. చోళ రాజులు పాలించిన కాలం. ఆలయాల వలన, అప్పటి శాసనాల వల్ల మన చరిత్ర తెలుస్తుంది.

ఇక్కడ విష్ణుముర్తి స్త్రీ-పురుష రూపాలతో వుంటాడు.  ఏకశిలా సాలగ్రామం. ముందు కేశవుడు– శంఖచక్రగద పద్మాల తో నాలుగు చేతులతో ఉంటాడు.

వెనక భాగం లో అందమైన తలకొప్పు .. 

సొగసుగా గోచి పోసి కట్టిన చీర కట్టు తో మనోహరం గా వుంది.  వెనక కాలి పిక్క మీద సహజంగా ఏర్పడినట్టు వున్న పుట్టుమచ్చ కూడా కనిపించేలా ఈ చీర కట్టు వుంది.   స్వామి వారి పాదాల నుండి నిరంతరమూ సన్న గా నీరు ఉబికి వస్తూంటుంది. విష్ణు పాదాన కదా గంగమ్మ పుట్టింది.

"హరిపాదాన పుట్టావంటే గంగమ్మా

శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మా"

పాట గుర్తుకు వచ్చింది


ఇట్లా గర్భాలయం లోకి వెళ్లడానికి ₹50/- ప్రత్యేక దర్శనం టికెట్  పెట్టారు. ర్యాలి ట్రాన్సఫర్స్ కోసం వెడతారని అందరికీ తెలిసినదే కదా.  బుధవారం ప్రత్యేకం. అయిదు బుధవారాలు అయిదు చొప్పున ప్రదక్షిణ చేయాలి అని రాసి వున్నది.


ర్యాలీ లో ఇలా చెన్నకేశవ-జగన్మోహిని ఆలయం వుంది అని  మాత్రమే అని తెలుసును. కాని పక్కనే శివాలయం కూడా  వుంది.  శ్రీఉమాకమండలేశ్వరస్వామి - ఆలయం అంటారు. అక్కడ పలకమీద పౌరాణిక నేపథ్యం రాసి వున్న దాని ప్రకారం, జగన్మోహిని గా వున్న విష్ణువును వెంబడించి వస్తాడు శివుడు.  ఈ చోటుకి వచ్చేసరికి శివ-కేశవులు యిద్దరూ పరస్పరం ఎదురుబడ్డారుట. విష్ణువు మోహినీ అవతారం చాలించి కేశవుడిగా నిలవగా, శివుడు ఇక్కడ శ్రీఉమాకమండలేశ్వర స్వామి గా ఆవిర్బవించాడుట‌.

విశేషం ఏమిటంటే.. పదకొండవ శతాబ్దం చోళ రాకుల కాలం లో నిర్మించిన ఈ ఆలయం లో శివలింగం నున్నగా కాకుండా రుద్రాక్ష వలె ఉంటుంది. సోమసూత్రం గాని, చండీశ్వరుడుగాని ఉండరు.  ఇక్కడ శివుడికి చేసిన అభిషేక జలం అంతా.. ఎంత చేసినా సరే గర్భగుడిలోనే యింకిపోతుందిట.  పక్కనే ఉన్న  కేశవుడి గుళ్లో జల ఊట కీ, శివాలయం లో అంతర్థానం అయ్యే నీటికి ఏమైనా సంబంధం వున్నదా? ఏమో..!








ఆ తరువాత  రావులపాలెం జంక్షన్ లొ చేసిన ఫలహారం గురించి చెప్పాలి.

నేను మొదటిసారి పనసాకుల లో వండే "పొట్టిక్కలు" రుచి చూశాను. దిబ్బరొట్టె, చెఱుకు పాకం.. అలా తలా కాస్త రుచి చూసాం.


అక్కడ నుండి ద్వారకా తిరుమల.  గుడి కట్టేస్తారేమోనని ఎంతోకంగారు పడుతూ వెళ్లిన మాకు, గర్భాలయంం లో స్పెషల్ దర్శనం చేసుకోవడం ఎంతో తృప్తిని యిచ్చింది.

చివరిగ గా అమ్మలగన్నయమ్మ విజయవాడ  కనకదుర్గమ్మ.. చల్లని చూపులు మామీద పడటం, అక్కడా ప్రత్యేక దర్శనం చేసుకోగలగడం పుణ్యం గా భావిస్తూ.. ఆ రోజే హైదరాబాదు రిటర్న్ అయ్యాం.


ఒక్క మూడు రోజుల్లో యిన్ని గుళ్లు తిరిగామా అని మాకే ఆశ్చర్యం కలిగింది.

అంతా భగవంతుడి కృప 🙏


స్వస్తి.



No comments:

Post a Comment